APSRTC : మార్చి 18 నుంచే దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. ఈ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం, అర్హతలు!

APSRTC : మార్చి 18 నుంచే దివ్యాంగులకు ఫ్రీ బస్సు సర్వీస్ నడుస్తుంది. ఈ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం, అర్హతల గురించి తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Published on: Mar 17, 2026, 06:36:41 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమ్మిళితత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్
దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 మార్చి 18న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులోకి వస్తుంది. RPwD చట్టం, 2016లోని సెక్షన్ 2 (ZC) పరిధిలోకి వచ్చే, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులందరికీ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన పీహెచ్‌సీ/వికలాంగుల ధృవీకరణ పత్రం ఉండాలి.

స్త్రీ శక్తి పథకం కింద నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణాలు ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది.

ప్రయాణ సౌకర్య ఉన్న బస్సులు

  • సిటీ ఆర్డినరీ
  • మెట్రో ఎక్స్‌ప్రెస్
  • పల్లె వెలుగు
  • అల్ట్రా పల్లె వెలుగు
  • ఎక్స్‌ప్రెస్

పైన చెప్పిన బస్సు సర్వీసుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులకు తోడుగా వచ్చే అర్హులైన సహాయకులకు ఈ బస్సు సర్వీసుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తారు. దివ్యాంగులకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన ప్రజా రవాణా సేవలను అందించడం ద్వారా, వారి ప్రయాణ సౌలభ్యాన్ని, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.

అర్హత కలిగిన లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా అనేక APSRTC బస్సు కేటగిరీలలో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా అమలు చేస్తారు. స్త్రీ శక్తి పథకంలో నడిచే బస్సుల్లో మార్చి 18న అధికారికంగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఈ కార్యక్రమం వికలాంగుల మెుబిలిటీ మెరుగుపరచడానికి, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సామాజిక అవకాశాలను మరింత సులభంగా పొందడంలో వారికి సహాయపడటానికి రూపొందించబడిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతటా వికలాంగులకు సమగ్ర అభివృద్ధి, గౌరవప్రదమైన ప్రజా సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ పథకం భాగంగా ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More