ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధికం.. ఒక్కరోజే 50 లక్షలకుపైగా ప్రయాణికులు, రూ.27.68 కోట్లు!
ఆదాయంలో ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కరోజే రూ.27.88 కోట్లు సంపాదించింది.
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం ద్వారా, ప్రయాణికుల నుండి మంచి ఆదరణతో ఈ రికార్డు పనితీరుని క్రియేట్ చేసింది. జనవరి 19న రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
సంక్రాంతి తర్వాత రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. డిమాండ్ పెరుగుదలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక బస్సులను నడిపింది. వైజాగ్ నుంచి కూడా చాలా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపారు అధికారులు. ఈ సేవలను సాధారణ ఛార్జీలతో నడపడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీని ప్రయాణికులు ఎంచుకున్నారు. దీనిద్వారా తమ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేలా చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రైవేట్ రవాణా, వ్యక్తిగత వాహనాల కంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వైపే చూశారు.
ఆర్టీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో బస్సులను ముందస్తుగా మోహరించడం, తగినంత మౌలిక సదుపాయాలు కల్పించడం, సమర్థవంతమైన కార్యాచరణ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ, ప్రయాణికుల డిమాండ్ల ఆధారంగా సేవలను అందించడం ద్వారా రికార్డు ఆదాయం సాధ్యమైందని పేర్కొంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపో, గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు కీలక పాత్ర పోషించారని ఆ ప్రకటన పేర్కొంది.
సంక్రాంతి సీజన్లో సాధించిన విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ఉద్యోగుల సమిష్టి కృషి, సమన్వయానికి అభినందనలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలకు అసాధారణ మద్దతు ఇచ్చిన ప్రయాణికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే ప్రోత్సాహం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


