...
...
Next Story

ఏయూలో ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా? బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్

ఆంధ్ర విశ్వవిద్యాలయం పాత విద్యార్థులకు తమ కోర్సులను పూర్తి చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. వివిధ కారణాల వల్ల పరీక్షలు పాస్ కాలేకపోయిన బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనుంది

Published on: Jun 2, 2026, 14:21:53 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పాత విద్యార్థులకు తమ కోర్సులను పూర్తి చేసుకునేందుకు ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. పలు కారణాల వల్ల పరీక్షలు పాస్ కాలేకపోయిన బ్యాక్‌లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షలు - 2026 (AU Special Drive Examinations 2026) నిర్వహిస్తోంది.

ఆంధ్రా యూనివర్సిటీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు
ఆంధ్రా యూనివర్సిటీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు

పరీక్షల ఇన్‌చార్జ్ కంట్రోలర్ జె. రత్నం జారీ చేసిన ప్రకటన ప్రకారం, 2010-11 మధ్య ప్రవేశం పొందిన, అలాగే 2025 నాటికి తమ కోర్సుల్లో సబ్జెక్టులు ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, వృత్తిపరమైన కోర్సుల విద్యార్థుల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) జూన్ 15 నుండి 'ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు-2026'ను నిర్వహించనుంది.

ఈ స్పెషల్ డ్రైవ్ పరీక్షలన్నీ విశాఖపట్నంలోని ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ బిల్డింగ్ వేదికగా జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి టైమ్‌టేబుల్‌ను త్వరలోనే యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో విడిగా విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక పరీక్షలు రాయడానికి ఏయూ నిర్దిష్ట బ్యాచ్‌ల విద్యార్థులకు అవకాశం కల్పించింది.

2010-11 అకడమిక్ ఇయర్ నుండి అడ్మిషన్ పొందిన వారు ఈ పరీక్షలకు అర్హులు. 2025 వ సంవత్సరం వరకు తమ కోర్సు కాలపరిమితిని పూర్తి చేసుకుని, ఇంకా బ్యాక్‌లాగ్స్ మిగిలిపోయిన విద్యార్థులందరూ ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, సైన్స్, లా మరియు ఎడ్యుకేషన్ వంటి అనేక రకాల కోర్సులను చేర్చారు. B.Arch., B.Tech., integrated B.Tech.-M.Tech., M.Tech., M.Planning, M.Pharmacy, M.Sc., M.A., M.Com., M.H.R.M., M.B.A., B.Pharmacy, Pharma-D, MCA, BCA, LL.B., LL.M., B.Ed., M.Ed., Special B.Ed., D.P.Ed., B.P.Ed., M.P.Ed., M.Sc. Computer Science and M.Sc. Information Systemsతోపాటుగా మరికొన్ని కోర్సుల పరీక్షలు రాయవచ్చు.

టైమ్‌టేబుల్ విడుదలైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. చాలా ఏళ్ల తర్వాత వర్సిటీ కల్పిస్తున్న ఈ తరహా స్పెషల్ డ్రైవ్ పరీక్షలు పాత విద్యార్థులకు తమ డిగ్రీలను పూర్తి చేసుకోవడానికి ఒక చివరి అవకాశంగా భావించవచ్చు.

అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఏయూ అధికారిక వెబ్‌సైట్ www.andhrauniversity.edu.in ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe