అరటి ధరలు అదుర్స్: శుభకార్యాల వేళ సామాన్యుల జేబుకు చిల్లు.. డజన్ ధర ఇదే!

నెలల తరబడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న అరటి రైతులు ప్రస్తుతం లాభాలను చూస్తున్నారు. అరటి ధరలు భారీగా పలుకుతున్నాయి.

Published on: Feb 24, 2026, 12:47:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో మూడు నెలలు ధరలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ధరలు క్వింటాలుకు రూ.2,000-రూ.3,000 వరకు పడిపోయినప్పుడు రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఈ పదునైన రికవరీ అవసరమైన ఉపశమనం కలిగించింది. ధరలు టన్నుకు రూ.25,000 కు పెరిగాయి.

అరటి ధరలు
అరటి ధరలు

ఈ-క్రాప్ డేటా ప్రకారం కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో అరటి సాగు అత్యధికంగా ఉంది. 13,820 హెక్టార్లలో పంట సాగు చేశారు. రైతులు సాధారణంగా ఎకరానికి దాదాపు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడతారు. దిగుబడి 15 నుండి 20 టన్నుల మధ్య ఉంటుంది.

కాలానుగుణ పంటల మాదిరిగా కాకుండా, అరటిపండ్లను ఏడాది పొడవునా పండిస్తారు. అయితే చాలా మంది రైతులు సాంప్రదాయకంగా డిమాండ్ ఎక్కువగా ఉండే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పంటలను కోసుకుంటారు. పులివెందుల అరటిపండ్లు ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రైతులు, వ్యాపారులు ఈ పండ్లు రుచి, నాణ్యత, నిల్వలో విభిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అరటిపండ్లు 8-10 రోజులు తాజాగా ఉంటాయి. పులివెందుల నుండి వచ్చినవి 12-14 రోజులు తాజాగా ఉంటాయట. దీనికి కారణం కొద్దిగా ఉప్పు నేల, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అని అంటున్నారు.

పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ పెరగడంతో పాటు, విదేశాల నుండి ఆర్డర్లు పెరగడంతో సాగు ఖర్చులను తగ్గించుకున్న తర్వాత చివరకు మంచి రాబడిని పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.

ఇక అనంతపురం జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది. కొన్ని రోజుల కిందట పడిపోయిన ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ధర రూ.25 వేలు టన్నుకు ఉంది. అనంతపురం జిల్లాలోని అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

కిందటి నెల వరకూ అరటి గెల రూ.200 నుంచి రూ.300 వరకు పలికింది. కానీ ఇప్పుడు ఒక గెల రూ.700 నుంచి రూ.1000 దాకా మార్కెట్లో పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో డజను అరటి పండ్లు రూ.70 నుంచి 100 మధ్యలో అమ్ముతున్నారు.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో అరటి పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు డిమాండ్ కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వ్యాపార పరిస్థితుల కారణంగా అరటి ఉత్పత్తి సరిగా జరగలేదు. దీంతో రైతుల నుంచి మార్కెట్‌లోకి వచ్చే సరఫరా తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి.

ఏప్రిల్ వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మ్యాంగో సీజన్ మెుదలైతే.. అరటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది. మ్యాంగో మార్కెట్లోకి వస్తే అరటి పండ్ల ధరలు తగ్గుతాయి. గోదావరి జిల్లాల్లో అరటిసాగు ఎక్కువగానే ఉంటుంది. కానీ నష్టాల కారణంగా అరటి సాగును రైతులు చాలా వరకు తగ్గించారు. దీంతో వ్యాపారులు సైతం పెద్ద మెుత్తంలో డబ్బులు చెల్లించి గెలలను కొంటున్నారు. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో అరటి ధరలు పెరిగాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More