అమెరికాలో భారీ వరదలు.. తెలుగు యువకుడు గల్లంతు
అమెరికాలో సంభవించిన వరదల్లో ఓ తెలుగు యువకుడు గల్లంతు అయ్యాడు. రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ దొరకడం లేదు.
ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు అక్కడ ప్రకృతి వైపరీత్యానికి గురై గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో ఇటీవల ముంచెత్తిన అకాల భారీ వర్షాలు, వరదల ఉధృతికి ఆంధ్రప్రదేశ్కు చెందిన దొప్పలపూడి వెంకటేష్ అనే యువకుడు కొట్టుకుపోయాడు. ఈ దారుణ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ లభించకపోవడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల పొరుగు రాష్ట్రమైన కాన్సాస్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఊహించని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి.
వెల్లింగ్టన్ ప్రాంత సమీపంలోని ఎస్. ఆలివర్ రోడ్ గుండా వెళ్తుండగా వెంకటేష్ ప్రయాణిస్తున్న వాహనం వరద ఉధృతికి చిక్కుకుంది. ప్రమాదవశాత్తూ ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక రెస్క్యూ టీమ్స్ జరిపిన గాలింపులో వెంకటేష్ ప్రయాణించిన కారు, ఆయన బ్యాగు లభ్యమైనప్పటికీ, అతని మొబైల్ ఫోన్ గానీ, వ్యక్తిగత ఆచూకీ గానీ ఇప్పటివరకు లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబంలో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి.
బాధిత కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు తక్షణమే స్పందించారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా ఒత్తిడి తేవాలని కోరుతూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని కీలక మంత్రులకు విడివిడిగా అత్యవసర లేఖలు రాశారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లకు లేఖలు పంపారు. వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా అమెరికా స్థానిక అధికారులతో మాట్లాడి గాలింపు వేగవంతం చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్కు కూడా లేఖ రాస్తూ.. ఏపీ ఎన్ఆర్టీఎస్ విభాగం ద్వారా అమెరికాలోని తెలుగు అసోసియేషన్లను సమన్వయం చేసి బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమ బిడ్డను అప్పగించాలని వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై తెలుగు కమ్యూనిటీలు సైతం స్పందించి స్థానిక కాన్సాస్ రెస్క్యూ టీమ్స్తో సంప్రదింపులు జరుపుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


