Garbage E-Challan In AP : ఈ నగరంలో రోడ్లు, మురుగు కాల్వల్లో చెత్త వేస్తే ఈ-చలాన్.. సీసీ కెమెరాలతో నిఘా
Garbage E-Challan : రోడ్లు, మురుగు కాల్వలో చెత్త వేస్తున్నారా? ఇక మీ ఇంటికే ఈ-చలాన్ వస్తుంది. సీసీ కెమెరాల నిఘాలో కొత్త రూల్ రానుంది. అది ఎక్కడో చూడండి..
తిరుపతి నగరంలోని రోడ్లపై, మురుగు కాలువల్లో చెత్త వేసే వ్యక్తులపై ఈ-చలాన్ వ్యవస్థ ద్వారా జరిమానాలు విధించడానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. అనేక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఉల్లంఘించిన వారిని గుర్తిస్తారు. మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ప్రతినిధులు, ఇతర వాటాదారులతో కలిసి సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పనితీరును సమీక్షించారు.

రోడ్లపై లేదా కాలువల్లో చెత్త వేసే వ్యక్తులను గుర్తించడానికి ఈ కెమెరాలు సహాయపడతాయని ఆ తర్వాత ఈ-చలాన్ వ్యవస్థ ద్వారా జరిమానాలు జారీ చేయబడతాయని మున్సిపల్ కమిషన్ చెప్పారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద నగరంలోని 20 ప్రధాన జంక్షన్లు, 111 ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మౌర్య తెలిపారు. పర్యవేక్షణ కోసం ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఏర్పడకుండా ఈ నిఘా వ్యవస్థ సహాయపడుతుందని అన్నారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్లపై వేసే వారిని కూడా కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధించడం జరుగుతుందని ఆమె అన్నారు.
మరోవైపు వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా ఎస్వీ జూ పార్క్ రోడ్డులోని తొమ్మిది ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నగరంలోని 20 జంక్షన్లలో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్(ATCS) కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ వ్యవస్థతో, వాహనాల కదలికకు అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మారుతాయి. ఇది రద్దీగా ఉండే కూడళ్లలో రద్దీని తగ్గిస్తుంది, అంబులెన్స్లు వంటి అత్యవసర వాహనాలు త్వరగా కదలడానికి సహాయపడుతుంది. చెత్త వేయడం, నిర్మాణ వ్యర్థాలను పారవేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు వంటివి సీసీటీవీ, ఏటీసీఎస్ కెమెరాల ద్వారా నమోదు చేస్తారు. ఈ-చలాన్ వ్యవస్థ ద్వారా జరిమానాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












