AP Govt IIT NEET Coaching : గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులకు సీట్లు దక్కేలా ప్రోత్సహించేందుకు గానూ ప్రత్యేకంగా "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" (CoE) ఏర్పాటు చేసింది.
విశాఖపట్నం కేంద్రంగా శిక్షణ….

విశాఖపట్నం జిల్లా మరికవలసలోని గురుకుల బాలుర పాఠశాల ప్రాంగణంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పారు. దేశంలోని అగ్రగామి విద్యాసంస్థలైన ఐఐటీలు (IITs), నిట్లు (NITs), ఎయిమ్స్ (AIIMS), ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల్లో ప్రవేశాలు సాధించాలనే పట్టుదల కలిగిన గిరిజన విద్యార్థులకు ఉచితంగా ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం.
ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇంటర్మీడియట్ స్థాయికి చెందిన మొత్తం 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన అవకాశాలు కల్పిస్తూ 300 మంది బాలురు, 300 మంది బాలికలకు స్థానం కల్పించారు. ప్రతిభ ఆధారంగా నిర్వహించిన పారదర్శక ఎంపిక ప్రక్రియ ద్వారా అర్హులైన 600 మంది ఎస్టీ విద్యార్థులను ఇప్పటికే ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థులను విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు తరలించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అకడమిక్ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా వెంటనే ప్రారంభమయ్యేలా వారి వసతి, రుచికరమైన పోషకాహార భోజనం, ఇతర నివాస ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల కోసం ఆధునిక డిజిటల్ ల్యాబ్లు, ఐసీటీ సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిచర్, మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులను నియమిస్తోంది. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల కోసం ఆధునిక డిజిటల్ ల్యాబ్లు, ఐసీటీ సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిచర్, మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులను నియమిస్తోంది. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీపడేలా అత్యుత్తమ విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గిరిజన విద్యార్థుల విద్యా, సామాజిక-ఆర్థిక పురోగతికి ఒక కీలకమైన మార్పును తెస్తుందని విద్యావేత్తలు ఆశిస్తున్నారు.