ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాలల్లో భాగంగా రూ.915 కోట్ల విలువైన పర్యాటక ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తొమ్మిది కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టి, పెండింగ్లో ఉన్న ఆరు కార్యక్రమాలకు అనుమతి కోరారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

దేవాలయాలు, బీచ్లు, వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ప్రాజెక్టులు ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్య ప్రదేశాలు మంగళగిరి, అరసవల్లి, వాడపల్లి, కోరుకొండ, నెల్లూరు, మచిలీపట్నం, లంబసింగి, లేపాక్షి, బౌద్ధ పర్యాటక సర్క్యూట్లతో పాటు రాజమండ్రిలో జాతీయ నాటక పాఠశాల ప్రాంగణాన్ని, అమరావతిలో పర్యాటక భవన్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.
అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటలిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్పీరియన్స్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా చర్చలు జరిగాయి. విశాఖపట్నంలో లలిత్ కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్లో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ శాఖ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలకు సానుకూల స్పందన లభించింది.
విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో 'కళాక్షేత్ర' ఆడిటోరియం ఏర్పాటుకు కూడా కేంద్రం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు షెఖావత్. చారిత్రాత్మక 'సూర్యరాయంధ్ర నిఘంటువు' పునర్ముద్రణకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారు.
తిరుపతి, విశాఖపట్నాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, వాటిని భారతదేశంలోని టాప్ 50 పర్యాటక గమ్యస్థానాలలో చేర్చడానికి దుర్గేష్ సహాయం కోరారు. అమలును వేగవంతం చేసేందుకు ఆయన పర్యాటక శాఖ కార్యదర్శి సుమన్ బిల్లా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్లతో కూడా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రాజెక్ట్ నివేదికలను అధికారులు అభినందించి, తమ మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
'ఇక తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు, అలాగే విజయవాడలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణానికి మద్దతు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నుండి సానుకూల స్పందన లభించడం ఆనందదాయకం. రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన రూ.430 కోట్ల ప్రాజెక్టుల పురోగతిని వివరించాను.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.
{{/usCountry}}'ఇక తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు, అలాగే విజయవాడలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణానికి మద్దతు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నుండి సానుకూల స్పందన లభించడం ఆనందదాయకం. రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన రూ.430 కోట్ల ప్రాజెక్టుల పురోగతిని వివరించాను.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.
{{/usCountry}}