Chandrababu Pawan Kalyan Convoy Reduce : పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి… ఇంధన పొదుపును పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత భద్రతా వాహనాల శ్రేణి (కాన్వాయ్) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వాహనాల కాన్వాయ్ తగ్గింపు….

ప్రధాని మోదీ స్ఫూర్తితో ఇకపై తాము పర్యటించే సమయాల్లో కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలోనే కాకుండా…. జిల్లాల పర్యటనల సమయంలోనూ వాహనాల సంఖ్య సగానికి మించకూడదని స్పష్టం చేశారు. కేవలం తమకే కాకుండా మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం…. సంక్షోభ పరిస్థితుల వల్ల చమురు ధరలపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని మోదీ సంకల్పానికి మద్దతుగా తన కాన్వాయ్ను సగానికి కుదిస్తూ భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ప్రధాని మోదీ స్వయంగా పొదుపు పాటిస్తూ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారని…. అదే స్ఫూర్తిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్భాటాలకు పోకుండా నిరాడంబరంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నేడు కేబినెట్ భేటీ - కీలక విధాన ప్రకటన
మరోవైపు ఇంధన పొదుపుతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో అనుసరించాల్సిన ఆర్థిక పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్) సమావేశంలో దీనిపై చర్చించి ఒక కీలక విధాన నిర్ణయం తీసుకోనున్నారు. దేశం కోసం ప్రతి పౌరుడు పొదుపు దిశగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
{{/usCountry}}మరోవైపు ఇంధన పొదుపుతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో అనుసరించాల్సిన ఆర్థిక పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్) సమావేశంలో దీనిపై చర్చించి ఒక కీలక విధాన నిర్ణయం తీసుకోనున్నారు. దేశం కోసం ప్రతి పౌరుడు పొదుపు దిశగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
{{/usCountry}}