...
...
Next Story

ఇంకా విషం చిమ్ముతున్నారు.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారని… ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని తయారుచేస్తామని పునరుద్ఘాటించారు.

Published on: Jan 25, 2026, 07:54:52 IST
Advertisement

చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. " నగరిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏడాది క్రితం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు...ఇది మన జీవన విధానం కావాలి. అందుకే ప్రతి నెలా 3వ శనివారం నాతో సహా నేతలు, అధికార యంత్రాంగం హాజరవుతున్నాము" అని తెలిపారు.

“స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను రూ.510 కోట్లతో చేపడుతున్నాం. రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్స్ హౌస్ హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మెప్మా ఆర్పీలకు సమకూర్చడం జరిగింది. గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0 కింద రూ.6.7 కోట్లతో 200 e-ఆటోలు, 12,000 ట్రైసైకిళ్లు, 5,000 పుష్‌కార్ట్స్ సిద్ధం చేశాం. గతేడాది నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద విస్తృతంగా పరిశుభ్రతా డ్రైవ్‌లు చేపట్టాం”అని వివరించారు.

“వచ్చే నెలలో కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పీపీపీ మోడల్‌లో చేపడుతున్నాం. రెండేళ్లలో ఇవి ఉత్పత్తి మొదలు పెడతాయి. విజయవాడ, తిరుపతికి కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే ప్రజలకు డంపింగ్ యార్డ్ సమస్య ఉండదు. కాలుష్యం కూడా తగ్గుతుంది”అని చెప్పారు.

అమరావతి ఆగదు - సీఎం చంద్రబాబు

“గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సీమను రాళ్ల సీమగా మార్చారు. గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు. కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారు. జల జీవన్ మిషన్ లో రూ. లక్ష కోట్లు వాడుకునే అవకాశం ఉన్నా అసమర్థతతో వదిలేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వారిని ఏం చేయాలి? పోలవరం డయాఫ్రమ్ వాల్ ను గోదావరిలో కలిపేశారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం. గోదావరి జలాలు సీమకు వస్తే నీటి సమస్య ఉండదు”అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks