గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని, ఆంగ్లం అవసరమే కానీ.. మాతృ భాషను మరిచిపోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని అన్నారు.

'మాతృభాష అమ్మతో సమానం. మాతృ భాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్కు అభినందనలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మభాష పండుగ ఇది. తెలుగు వారి ఆత్మగౌరవం చాటిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు ఈ వేదికకు పెట్టడం మంచి విషయం. దేశంలో అనేక భాషలు ఉన్నా ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉంది. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనం చాటేందుకు ఉపయోగపడతాయి.' అని చంద్రబాబు అన్నారు.
తెలుగు రచనలు అంటే నన్నయ్య మహాభారతం, అష్టదిగ్గజాలు అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గురజాడ వంటి అనేకమంది గొప్ప రచయితలు.. పద్య రచయితల రచనలను మనం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. అన్నమయ్య, రామదాసు, మెుల్ల, వెంగమాంబ వంటివారు భక్తి మార్గంలో తెలుగుకు వన్నె తెచ్చారని కీర్తించారు.
'గ్రాంథిక భాష నుంచి వచన భాషగా మార్చిన వారిని మరిచిపోలేం. నేను తెలుగువాడిని నాది తెలుగు భాష అని చాటిన వ్యక్తి ఎన్టీఆర్. భాషాప్రయుక్త రాష్ట్రాలు రావాలని పోరాడిన వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములును మరవలేం. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలని పోరాడిన బూర్గుల రామకృష్ణారావు త్యాగం మరవలేం. వారసులుగా భాషను కాపాడుకోవడం మన బాధ్యత.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, ప్రతిభ చూపినవారికి పూర్ణకుంభ వంటి అవార్డులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. 1949లో హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్గా ఎదిగిందన్నారు. 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్కు మళ్లీ ఊపిరిపోశారన్నారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీతో భాష కనుమరుగు అవుతుందని అన్నారని, కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చన్నారు.
{{/usCountry}}తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నవారు, ప్రతిభ చూపినవారికి పూర్ణకుంభ వంటి అవార్డులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. 1949లో హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్గా ఎదిగిందన్నారు. 2017లో ఆంధ్ర సారస్వత పరిషత్కు మళ్లీ ఊపిరిపోశారన్నారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీతో భాష కనుమరుగు అవుతుందని అన్నారని, కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చన్నారు.
{{/usCountry}}'కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అడ్డుపడలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరం. నీటి విషయంతోపాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలి. గంగా-కావేరి కలవాలి.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలి. అదే నా కోరిక. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలి. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే అడ్డుచెప్పలేదు.' అని చంద్రబాబు మాట్లాడారు.