అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ వద్ద మంటలను ఓఎన్జీసీ నిపుణులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించారు. గ్యాస్ లీక్ను నిర్వహించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి వివిధ విభాగాలు అమలు చేస్తున్న చర్యలను హోంమంత్రి అనిత, ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర అధికారులు వివరించారు.

ఇటువంటి సంఘటనలు జనాల్లో భయాందోళనలకు కారణమవుతాయని, స్థానిక ప్రజలకు వాస్తవాలను క్రమం తప్పకుండా తెలియజేయడం, వారికి భరోసా, మద్దతు అందించడం చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పరిస్థితి పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు స్థానికులకు సహాయం చేయడం జిల్లా యంత్రాంగం బాధ్యత అని నొక్కి చెప్పారు. అగ్నిప్రమాదంలో కొబ్బరి చెట్లు దెబ్బతిన్న వారికి పరిహారం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
'మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సాయం తీసుకోవాలి. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఓఎన్జీసీతోపాటుగా ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించాలి.' అని చంద్రబాబు ఆదేశించారు.
ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు ఢిల్లీ, ముంబై నుంచి వచ్చారు. నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి వచ్చేందుకు ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా వెల్లడించారు అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్. బాధితులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా తెలిపారు.
సోమవారం అగ్నిప్రమాదం జరిగిన చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల ప్రజలను భద్రత కారణాల దృష్ట్యా తరలించారు. ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బావిలో మరమ్మతులు, సాంకేతిక పనులు జరుగుతున్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. లీకైన గ్యాస్కు నిప్పు రవ్వలు అంటుకున్న కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
{{/usCountry}}సోమవారం అగ్నిప్రమాదం జరిగిన చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల ప్రజలను భద్రత కారణాల దృష్ట్యా తరలించారు. ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బావిలో మరమ్మతులు, సాంకేతిక పనులు జరుగుతున్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. లీకైన గ్యాస్కు నిప్పు రవ్వలు అంటుకున్న కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
{{/usCountry}}ఈ మంటల వేడి కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయాయి. పంట పొలాలు, ఆక్వా సాగుకు కూడా పెద్ద నష్టం జరుగుతుందని అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అగ్నికీలల్లో డ్రిల్లింగ్ రిగ్, లాగింగ్ టూల్స్, భారీ వాహనాలు కాలిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఉత్పత్తి మెరుగుదల కార్యకలాపాల కోసం డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024లో రూ.1,402 కోట్ల ఒప్పందాన్ని పొందింది . ఆ కంపెనీ మోరి-5 బావిని దాదాపు ఒక సంవత్సరం నుండి నిర్వహిస్తోందని ఓఎన్జీసీ అధికారి ఒకరు తెలిపారు.