గోల్డ్ రింగ్తో వివాదం.. గోదావరి నదిలోకి దూకిన దంపతుల ఘటనలో కొత్త విషయం
గోదావరి నదిలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉంగరం కారణంగానే భార్యాభర్తలు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిసింది.
ఒక్క ఉంగరం వల్ల తలెత్తిన వివాదం, వేధింపుల కారణంగా దంపతుల ప్రాణాలనే బలితీసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), అతని భార్య శిరీష (28) కొన్నాళ్లుగా భీమవరంలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి వీరు చించినాడ వంతెనపైకి వచ్చి గోదావరి నదిలోకి దూకేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం రోజంతా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దంపతుల ఆచూకీ లభించలేదు.
రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సాయికృష్ణకు తాకట్టు పెట్టమని ఒక ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చే విషయంలో ఇరువురి మధ్య వ్యత్యాసాలు వచ్చాయి. గురువారం ఉదయం సదరు వ్యక్తి మరికొందరితో కలిసి వేల్పూరులోని సాయికృష్ణ ఇంటి దగ్గర గొడవ చేశారు. అనంతరం భీమవరంలోని వారి ఇంటికి వెళ్లి, కేవలం రూ. 50 వేల బకాయి కోసం దంపతులిద్దరినీ తీవ్ర పదజాలంతో దూషించారు. మానసిక చిత్రహింసలు తాళలేకే తమ కుమారుడు, కోడలు ఈ దారుణానికి ఒడిగట్టారని డీవీడీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆత్మహత్యకు ముందు సాయికృష్ణ రికార్డు చేసిన ఒక ఆడియో మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఉంగరం తిరిగి ఇచ్చేందుకు సమయం అడిగాం. మా అప్పులు తీర్చే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరని చెప్పినా వినకుండా, నా భార్యను ఇష్టానుసారంగా నిందించారు. ఇక భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు.' అని ఆ ఆడియోలో పేర్కొన్నాడు.
దీనికి తోడు, ఆత్మహత్యకు రెండు రోజుల ముందు సాయికృష్ణ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వేల్పూరులోని తమ కవల పిల్లల్లో ఒక పాపను తన వద్దకు పంపకపోతే ఫ్యాన్కు ఉరివేసుకుంటానని, కొందరు వ్యక్తులు తనను కించపరిచారని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
సాయికృష్ణ, శిరీష దంపతులు తమ కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకే వంతెన వద్దకు వచ్చారు. అయితే చివరి నిమిషంలో మనసు మారడంతో, కుమారుడిని బైక్పైనే ఉంచి దంపతులిద్దరూ నదిలోకి దూకేశారు. కళ్లముందే కన్నతల్లిదండ్రులు నీటి అలల్లో కొట్టుకుపోతుంటే ఆ పసివాడు పడిన వేదన స్థానికులను కలచివేసింది. పోలీసులు ప్రస్తుతం ఆ బాలుడిని మేనత్త రక్షణలో ఉంచారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియో ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


