విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్(BRICS) యువజన, క్రీడా శాఖ మంత్రుల సమావేశాలు 2026లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. ఈ సైక్లింగ్ ర్యాలీలో బ్రిక్స్ కూటమికి చెందిన సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో విదేశీ ప్రతినిధులు వైజాగ్ నగర అందాలను, తీర ప్రాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగమైన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంతో ఈ బ్రిక్స్ ర్యాలీ అనుసంధానమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1,800 నగరాల్లో ఒకే రోజు నిర్వహించిన ఈ సైక్లింగ్ డ్రైవ్లో దాదాపు 50 లక్షల మంది యువత ఉత్సాహంగా పాల్గొని సరికొత్త ఉత్సాహాన్ని నింపారని ఆయన వెల్లడించారు.
సైక్లింగ్ను ఒక అత్యుత్తమ వ్యాయామంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి మాండవీయ, ఇది కేవలం శారీరక ఫిట్నెస్ పెంచడానికే కాకుండా పెరుగుతున్న వాయు కాలుష్యానికి ఒక చక్కటి పరిష్కారమని కొనియాడారు. ప్రజలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఆదివారం తప్పకుండా సైకిల్ తొక్కాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ సైక్లింగ్ ర్యాలీ నోవోటెల్ హోటల్ నుంచి ప్రారంభమై ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సీ హారియర్ మ్యూజియం వరకు సాగి, తిరిగి నోవోటెల్ హోటల్ వద్దకు చేరుకుంది. ఈ భారీ అవగాహన ర్యాలీలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొని ప్రాధాన్యత పెంచారు.
బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. వీరితో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, బ్రిక్స్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సైక్లింగ్ ఈవెంట్ స్థానికులలో, యువతలో ఫిట్నెస్పై సరికొత్త చైతన్యాన్ని రగిలించింది.
{{/usCountry}}బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. వీరితో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, బ్రిక్స్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సైక్లింగ్ ఈవెంట్ స్థానికులలో, యువతలో ఫిట్నెస్పై సరికొత్త చైతన్యాన్ని రగిలించింది.
{{/usCountry}}