గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డీడీఓ కార్యాలయాలు : పవన్ కల్యాణ్

ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందని చెప్పారు.

Published on: Dec 04, 2025 4:46 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిత్తూరులో కొత్త డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీఓ) కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో అదనంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో గ్రామీణాభివృద్ధి శాఖ పాత్రను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

'సమాజానికి సేవ చేసే, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగుల పదోన్నతులు ఉన్నాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఐటీ విభాగాన్ని తీసుకొస్తాం.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ చెప్పారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అధికారులకు పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు చేస్తున్నట్టుగా పవన్ తెలిపారు. నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు ఉంటాయన్నారు.

'ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి. చంద్రబాబు సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నాం. డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది.' అని పవన్ కల్యాణ్ అన్నారు.

డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలను పారదర్శకతతో అమలు చేయాలని వర్చువల్‌ సమావేశంలో పవన్ చెప్పారు. ఈ కార్యాలయాల ద్వారా డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యాలయాలు ఉండటం వల్ల మరింత ఫలితాలు సాధించాలని చెప్పారు. ఎలాంటి సిఫారసులు లేకుండా అధికారులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.

'సామర్థ్యం పెంచేందుకు శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఐటీ విభాగం. గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డీడీఓ కార్యాలయాలు ఉపయోగపడతాయి.' అని పవన్ కల్యాణ్ అన్నారు.