పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు(DISCOMs) కొనుగోలు చేస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి భీమవరంలోని ఒక లబ్ధిదారుని నివాసంలో ఏర్పాటు చేసిన రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ను మంత్రి రవి కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి రవి కుమార్ మాట్లాడుతూ, PM-KUSUM పథకం కింద రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన సౌర విద్యుత్తు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించినట్టుగా తెలిపారు. సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2,000 సోలార్ కనెక్షన్లు, అలాగే వెనుకబడిన, ఇతర కులాలకు చెందిన కుటుంబాలకు 6,000 కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ పనుల్లో వేగం పెంచాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్ కనెక్షన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. భీమవరంలో పర్యటించిన మంత్రి.. ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో వర్చువల్గా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వాడలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. అదే సమయంలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు తెలిపారు.
ఈపీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ ద్వారా 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అవసరమైన భూ కేటాయింపుల నిమిత్తం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది రైతులకు 11,719 వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
{{/usCountry}}వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది రైతులకు 11,719 వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
{{/usCountry}}రానున్న గోదావరి పుష్కరాలకు ఈపీడీసీఎల్ అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గోదావరి పుష్కరాలను జయప్రదం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.