తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ.. దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై చాలాసేపు చర్చించారు.

Published on: Mar 04, 2026 8:13 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చర్చ జరిగింది. వాడీవేడీగా వ్యాఖ్యలు చేసుకున్నారు నేతలు. మండలి ఛైర్మన్ చర్చకు ఒక గంట సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 నిమిషాలు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి 20 నిమిషాలు, ప్రభుత్వం స్పందించడానికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ

ఈ చర్చను స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నెయ్యి కల్తీ అంశంపై మాట్లాడుతూ, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యల సమయంలో హెరిటేజ్ బ్రాండ్‌ను ప్రస్తావించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ సమస్యకు, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేయడం ఎంతవరకు సముచితమని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్ ఇప్పటికే ఏ ప్రభుత్వ సంస్థలకు నెయ్యి సరఫరా చేయకూడదని నిర్ణయించిందని ఎత్తి చూపారు.

ప్రతిపక్ష సభ్యులు హెరిటేజ్‌ను పదే పదే ప్రస్తావిస్తూ ప్రధాన అంశం నుండి చర్చను మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం వివరణాత్మక వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ వ్యాఖ్యలను ఛైర్మన్ మోషేన్ రాజు తప్పుబట్టారు. ఆ తర్వాత అచ్చెన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాల మధ్య తదుపరి కార్యకలాపాలు కొనసాగాయి.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌పై జగన్‌ కనీసం సంతకం పెట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర పెరిగిందని, వాళ్లు చేసినట్లు మేం కూడా కల్తీ చేసిన నెయ్యి వాడాలా? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. కల్తీ జరిగిందని స్పష్టంగా సీబీఐ నివేదికలో ఉందని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిని ఒప్పుకొన్నారని వ్యాఖ్యానించారు. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడని లోకేష్ అన్నారు.

అనేక భయంకరమైన రసాయనాలు కలిసి ఉన్నవాటికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. రోజుకు 4లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సడలించారని ఆరోపణలు చేశారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించేశారని చెప్పారు. సాంకేతిక అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా టెండర్లు కట్టపెట్టారన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More