...
...
Next Story

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 12 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

Published on: Aug 6, 2026, 09:26:34 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే వైద్య విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2026-27 విద్యాసంవత్సరానికి గాను యూజీ మెడికల్ యాజమాన్య/కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

యూనివర్సిటీ అనుబంధ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఉన్న కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లతో పాటు తిరుపతిలోని ‘శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాల (SVIMS)’లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026)లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నమోదు కోసం అధికారిక పోర్టల్ https://drntr.uhsap.in ను సందర్శించాల్సి ఉంటుంది.

ఆగస్టు 12వ తేదీ రాత్రి 9.00 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం ఉంది. ఆగస్టు 13, 14 తేదీల్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నిర్ణీత లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

యూనివర్సిటీ స్పష్టం చేసిన కీలక విషయం ఏమిటంటే.. విద్యార్థులు ఇప్పుడు చేసే ఒకే ఒక ఆన్‌లైన్ దరఖాస్తు ఆధారంగానే కౌన్సెలింగ్ మొదటి రౌండ్, రెండో రౌండ్, చివరగా నిర్వహించే స్ట్రే వేకెన్సీ రౌండ్‌లకు పరిశీలిస్తారు. కాబట్టి విద్యార్థులు మొదటి విడతలోనే తప్పులు లేకుండా సరిగ్గా దరఖాస్తు చేసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సమయంలో కింది సర్టిఫికెట్లను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి:

10వ తరగతి (SSC) మార్కుల జాబితా (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం).

ఇంటర్మీడియట్ / 10+2 మార్కుల మెమో.

6వ తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు (లోకల్ స్టేటస్ కోసం).

కుల ధృవీకరణ పత్రం (వర్తించే కేటగిరీ విద్యార్థులకు - BC/SC/ST).

ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ (వర్తించే వారి కోసం).

ఆధార్ కార్డ్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు.

తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం.

నీట్ యూజీ 2026లో కట్-ఆఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన వారు మాత్రమే ఈ ఆన్‌లైన్ దరఖాస్తుకు అర్హులు. విద్యార్థులు ఇచ్చే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలి. ఎస్‌ఎంఎస్‌ (SMS) ద్వారానే కీలకమైన ఓటీపీ (OTP)లు, కౌన్సెలింగ్ అప్‌డేట్‌లు అందుతాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవచ్చు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వెబ్‌సైట్ సర్వర్ సమస్యలు రాకముందే వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe