Special Intensive Revision in Andhrapradesh : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సరికొత్తగా అప్డేట్ చేయడానికి 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026' (Special Intensive Revision - SIR) ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సవరణ ప్రక్రియకు జూలై 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.
ఇంటింట సర్వే…

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నారు. మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs) జూన్ 15 నుంచి జూలై 14 వరకు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వచ్చి సర్వే నిర్వహిస్తారు.
ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీల తరఫున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) కూడా బీఎల్వోలకు సహాయకరంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.
ఓటర్ల జాబితా సవరణ - ముఖ్యమైన తేదీలు:
- జూన్ 6 నుంచి జూన్ 14 వరకు : ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, అధికారులకు శిక్షణ అవసరమైన ఫారాల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుంది.
- జూన్ 15 నుండి జూలై 14 వరకు : బీఎల్వోల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalisation) ప్రక్రియను కూడా జూలై 14 లోగా పూర్తి చేస్తారు.
- జూలై 2 1: సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు.
- జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం క్లెయిమ్లు దాఖలు చేయడానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు.
- జూలై 21 నుండి సెప్టెంబరు 18 వరకు : వచ్చిన క్లెయిమ్లు, నోటీసులు మరియు అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు.
- సెప్టెంబరు 22 : అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితానుఅధికారికంగా విడుదల చేస్తారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు అందరూ భాగస్వాములు కావాల్సిన ఒక కీలకమైన ప్రక్రియ అని సీఈవో వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మరియు లోపాలు లేకుండా జరగాలనేదే ఎన్నికల సంఘం లక్ష్యమని ఆయన వివరించారు. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తమ బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) తప్పనిసరిగా నియమించాలని…. ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివేక్ యాదవ్ కోరారు.
{{/usCountry}}ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు అందరూ భాగస్వాములు కావాల్సిన ఒక కీలకమైన ప్రక్రియ అని సీఈవో వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మరియు లోపాలు లేకుండా జరగాలనేదే ఎన్నికల సంఘం లక్ష్యమని ఆయన వివరించారు. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తమ బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) తప్పనిసరిగా నియమించాలని…. ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివేక్ యాదవ్ కోరారు.
{{/usCountry}}