ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈకేవైసీ చేశారా లేదా..? మీ కార్డు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా వీటి మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్తగా కార్డులు పొందిన వారు ఈకైవైసీ పూర్తి చేసుకోలేదు. దీంతో వీరి కార్డులు రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Published on: Nov 8, 2025, 12:50:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.

స్మార్ట్ రేషన్ కార్డులు – E-KYC తప్పనిసరి
స్మార్ట్ రేషన్ కార్డులు – E-KYC తప్పనిసరి

ఈకేవైసీ తప్పనిసరి…!

స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.

ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.

రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

కాబట్టి ఈకేవైసీ విషయంలో లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది.

ఈకేవైసీ స్టేట‌స్‌ను ఆన్‌లైన్‌లోనే సొంతంగానే తెలుసుకోవ‌చ్చు. రేష‌న్ డీల‌ర్‌, ఎండీయూ వాహ‌నంలో ఈపోస్ యంత్రంలో మీ రేష‌న్ కార్డు వివరాలు న‌మోదు చేస్తే స‌భ్యుల వివ‌రాల‌న్నీ వ‌స్తాయి. ఎరుపు రంగు గ‌డియ‌లో పేర్లు ఉంటే ఈకేవైసీ అప్‌డేట్ కాన‌ట్లే. అదే ఆకుప‌చ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తి అయిన‌ట్లే. ఎరుపు రంగు గ‌డిలో పేరు ఉన్న‌వారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ పూర్తి అవుతుంది.

ఈకేవైసీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:

  1. ఆన్‌లైన్‌లో ఈకేవైసీ స్టేట‌స్‌ను చెక్ చేయాలంటే.. https://epdsap.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. అప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ క‌న్స్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్ అండ్ సివిల్ స‌ప్లైస్‌ ఏపీ అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
  3. ఇందులో ఈపీడీఎస్ అని ఉంటుంది. దానిలో రేష‌న్ కార్డు విభాగంలో ఆరు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.
  4. ఇక "epds application search", "rice card search" అని ఉంటాయి. ఆ రెండింటిలో ఒక అప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
  5. ఇక్కడ రేష‌న్ కార్డు నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అప్పుడు రేష‌న్ కార్డులోని ల‌బ్ధిదారుల పేర్లు వ‌స్తాయి.
  6. పేర్ల ఎదురుగా చివ‌రిలో ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయిన‌ట్లు, నో అని ఉంటే ఈకేవైసీ కాన‌ట్లు. ఈకేవైసీ కాక‌పోతే వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అవుతుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More