SIR గడువు మరో వారం పొడిగించిన ఈసీ.. ఏపీలోనూ చేపట్టాలన్న టీడీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ను భారత ఎన్నికల సంఘం చేపట్టాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. SIRను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SIRను స్వాగతిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ను పార్టీ స్వాగతిస్తున్నట్లు, ఏపీలోనూ చేపట్టాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

పార్లమెంటు సజావుగా సాగేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని పార్టీల సహకారాన్ని కోరిందని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. సోమవారం ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో SIR గురించిన ఆందోళనలపై చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ ఈ సమావేశంలో వివిధ అంశాలను లేవనెత్తిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల పంపకంపై సమావేశంలో చర్చకు డిమాండ్ చేసినట్టుగా తెలిపారు.
జల్ జీవన్ మిషన్ అంశాన్ని కూడా తాను లేవనెత్తానని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. ఈ పథకం ఎలా అమలు చేయబడుతుందో, ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో స్పష్టత వచ్చేలా పార్లమెంటులో చర్చ జరగాలని కోరారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న సందర్భంగా SIRపై తన పార్టీ అభిప్రాయాలను వినిపించారు.
పన్నెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తమ వివరాలను చెక్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ కారణంగా ముసాయిదా ఎన్నికల జాబితా డిసెంబర్ 9వ తేదీకి బదులుగా డిసెంబర్ 16న విడుదల కానుంది. తుది ఓటర్లు జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీకి బదులుగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తారు. రాబోయే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల కచ్చితత్వం, సమగ్రతను పెంచడం ఈ చర్య లక్ష్యం.
అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో SIR జరుగుతోంది. SIR తదుపరి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కవర్ అయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


