విశాఖలో ఈ మధ్యకాలంలో నైట్ టైమ్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు పదే పదే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేసిన వ్యక్తే ఈ చోరీలు చేశాడని గుర్తించారు.

కాకినాడకు చెందిన మహేశ్ రెడ్డి అలియాస్ సన్నీ వైజాగ్లోని మాధవధార ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఐటీ రంగంలో మంచి జీవితం ఉన్నప్పటికీ విలాసాలకు అలవాటుపడ్డాడు. వైజాగ్కు మకాం మార్చాడు. అతడి మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు. లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, అనేకసార్లు విదేశాలకు వెళ్తుండేవాడు. మెుత్తానికి లగ్జరీ లైఫ్ను గడిపేవాడు సన్నీ.
అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నాడు. కానీ ఇటీవలి కాలంలో పోలీసులకు పదే పదే రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. నెలల తరబడి దర్యాప్తు చేశారు పోలీసులు. 27 ఏళ్ల అచ్చి మహేష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి లగ్జరీ లైఫ్ స్టైల్ చూసి పోలీసులే షాక్ అయ్యారు.
వైజాగ్, ఇతర ప్రాంతాలలో విలాసవంతమైన జీవనశైలికి నిధులు సమకూర్చుకునేందుకు వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. రాత్రుళ్లు దొంగతనాలు చేసేవాడు. అతడి అరెస్టు తర్వాత.. వైజాగ్ పోలీసులు గాజువాక, అరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడతో సహా నగరంలోని వివిధ ప్రాంతాలలో 26 ఇళ్ల చోరీ కేసులను ఛేదించారు.
ఈ కేసుల్లో దాదాపు రూ.24.66 లక్షల విలువైన నగలు, నగదును దొంగిలించాడు మహేశ్ రెడ్డి. వీటిలో 1,084 గ్రాముల బంగారం, 6,300 గ్రాములకు పైగా వెండి, రూ.40,500 నగదు ఉన్నాయి.
మహేశ్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు దాదాపు 699 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, నంబర్ లేని స్కూటర్, దొంగతనానికి ఉపయోగించే ఉపకరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
{{/usCountry}}మహేశ్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు దాదాపు 699 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, నంబర్ లేని స్కూటర్, దొంగతనానికి ఉపయోగించే ఉపకరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
{{/usCountry}}విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకా బ్రత బాగ్చి చెప్పిన వివరాల ప్రకారం.. మహేశ్ రెడ్డి చిన్నప్పటి నుండే దొంగతనాల చేసే అలవాటు ఉంది. 15 సంవత్సరాల వయసులో పీఎంపాలెం ప్రాంతంలో ఇళ్లలోకి చొరబడి పట్టుబడ్డాడు. కొన్నిరోజులు జువైనల్ హోమ్కు పంపారు. విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం, రాజమండ్రి పరిసరాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. 14 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా దొంగతనాల కేసుల్లో అతను పాల్గొన్నట్లు పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఉద్యోగం కూడా చేసేవాడు.
ఇళ్లలోకి చొరబడటానికి మహేశ్ మాస్క్లు, టోపీలు, చేతి తొడుగులు, సుత్తులు, స్క్రూడ్రైవర్లు, డ్రిల్లింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రాసిక్యూషన్ కోసం ఛార్జ్షీట్ సిద్ధం చేస్తున్నారు.