మెుంథా ఎఫెక్ట్ చూపిస్తుంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గడిచిన ఆరు గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది తుపాను. మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం రాత్రికి తీరం దాటనుంది. ఈ సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మెుంథా తుపాను ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతూనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు.
విమాన సర్వీసులు రద్దు
ఇక తుపాను ఎఫెక్ట్ రాకపోకలపై తీవ్రంగా కనిపిస్తుంది. తీరం దిశగా మెుంథా తుపాను చురుగ్గా కదులుతోంది. ఇప్పటికే 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. తాజాగా పలు విమానాలను కూడా రద్దు చేశారు. దిల్లీ వెళ్లే విమానాలు మినహా మిగిలిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఐఎక్స్ 28919 విశాఖపట్నం-విజయవాడ, ఐఎక్స్ 2862 విజయవాడ-హైదరాబాద్, ఐఎక్స్ 2875 విజయవాడ-బెంగళూరు, ఐఎక్స్ 976 షార్జా-విజయవాడ, ఐఎక్స్ 975 విజయవాడ-షార్జా, ఐఎక్స్ 2743 హైదరాబాద్ విజయవాడ, ఐఎక్స్ 2743 విజయవాడ-విశాఖపట్నం సర్వీసులు రద్దయ్యాయి.
దక్షిణ మధ్య రైల్వే సూచనలు
ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రజలకు సూచలను చేసింది. అత్యవసరం అయితేనే రైళ్లలో ప్రయాణం చేయాలని పేర్కొంది. విజయవాడలో కంట్రోల్ రూమ్ ద్వారా రైళ్ల రాకపోకలు, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపింది. ప్రయాణికుల రైళ్ల స్టేటస్ తెలుసుకుని బయలుదేరాలని చెప్పింది.
NTES మెుబైల్ యాప్ ద్వారా రైళ్ల రాకపోకలను తెలుసుకోవచ్చు. https://enquiry.indianrail.gov.in/mntes/ లోకి వెళ్లి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే సమాచారం ద్వారా కూడా తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
విజయవాడకు భారీ వర్ష సూచన
{{/usCountry}}NTES మెుబైల్ యాప్ ద్వారా రైళ్ల రాకపోకలను తెలుసుకోవచ్చు. https://enquiry.indianrail.gov.in/mntes/ లోకి వెళ్లి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే సమాచారం ద్వారా కూడా తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
విజయవాడకు భారీ వర్ష సూచన
{{/usCountry}}మంగళవారం తుపాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 16 సెం.మీపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 9154970454, వీఎంసీ కార్యాలయంలో 08662424172, 08662422515, 08662427485 నెంబర్లు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.