ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ప్రతిపాదిత 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్పై అప్డేట్ వచ్చింది. జాతీయ రహదారి-65పై ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఎల్బీ నగర్-హయత్నగర్ ప్రాజెక్టు పురోగతిని అంచనా వేయడానికి మంత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్వీస్ రోడ్లు, జాతీయ రహదారి, మెట్రో రైలు మౌలిక సదుపాయాల కనెక్టివిటీ, వెడల్పాటి పిల్లర్ల రూపకల్పన, మెట్రో నిర్మాణాలు, స్టేషన్లతో అనుసంధానం వంటి కీలక అంశాలను కూడా సమీక్షించారు.
నాగ్పూర్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది ఒకటి అవుతుందని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మార్గంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ప్రమాద రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థానిక రాకపోకల కోసం సర్వీస్ రోడ్లు ఉండగా.. ప్రధాన వాహనాలు ఎలివేటెడ్ లెవెల్స్పై ప్రయాణిస్తాయి. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే వాహనాలు దాదాపుగా ఈ కారిడార్ మీదుగానే వెళ్తాయి.
రూ. 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇందులో తమ వాటాగా రూ. 200 కోట్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
ఈ ప్రాజెక్టును వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అనుమతులను వేగవంతం చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనుమతులు కోరేందుకు వచ్చే వారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారితో సమావేశమవుతానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
{{/usCountry}}ఈ ప్రాజెక్టును వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అనుమతులను వేగవంతం చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనుమతులు కోరేందుకు వచ్చే వారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారితో సమావేశమవుతానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
{{/usCountry}}ఈ కారిడార్ పూర్తయిన తర్వాత, ఎల్బీ నగర్, హయత్ నగర్లోని 54 కాలనీలలో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఇది రద్దీని తగ్గించి, రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. అలాగే హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు 15 నిమిషాల లోపు నగరాన్ని దాటేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.