...
...
Next Story

Godavari Flood Update : భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం - ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Godavari Flood Update : గోదావరి నదికి భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అధికారుల సమాచారం ప్రకారం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Published on: Aug 2, 2026, 09:19:42 IST
Advertisement

Godavari Flood Update : గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది భద్రాచలం వద్ద క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుత నీటిమట్టాల వివరాలు…

తగ్గుతున్న గోదావరి ఉధృతి
తగ్గుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 47.9 అడుగులకు చేరింది. ప్రవాహం తగ్గడంతో అధికారులు ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఇక కూనవరం వద్ద నీటిమట్టం 21.50 మీటర్లుగా నమోదు కాగా, పోలవరం వద్ద 13.39 మీటర్ల వద్ద ప్రవాహం కొనసాగుతోంది.

ధవళేశ్వరం వద్ద తగ్గని ఉధృతి…

ఎగువన ప్రవాహం తగ్గుతున్నప్పటికీ, దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజి వద్ద మాత్రం వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.69 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలకు స్థానిక ప్రజలు, బాధితులు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు, పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.

ఏపీకి వర్ష సూచన :

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe