Guntur Tirupati Train Extension : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను నెరవేరుస్తూ…. గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
మూడేళ్ల నిరీక్షణకు ఫలితం

ఈ రైలును తిరువణ్ణామలై (అరుణాచలం) వరకు పొడిగించాలని గత మూడేళ్లుగా భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగా సాగిన నిరంతర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్….. వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు ఈ రైలును నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ పొడిగింపు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నంద్యాల, కడప మీదుగా ప్రయాణించే ఈ రైలు ద్వారా భక్తులు ఇప్పుడు ఒకే ప్రయాణంలో పలు ప్రధాన క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
- కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని స్వయంభూ వినాయక క్షేత్రం.
- వెల్లూరు: ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం మహాలక్ష్మి ఆలయం).
- తిరువణ్ణామలై: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అరుణాచలేశ్వర ఆలయం.
- శ్రీరంగం: దక్షిణ భారత దేశంలోనే అత్యంత పవిత్రమైన రంగనాథస్వామి క్షేత్రం.
ఈ రూట్ పొడిగింపు వల్ల కేవలం యాత్రికులకే కాకుండా….. ఉపాధి నిమిత్తం తమిళనాడు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా ఎంతో వెసులుబాటు కలుగుతుంది. నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}ఈ రూట్ పొడిగింపు వల్ల కేవలం యాత్రికులకే కాకుండా….. ఉపాధి నిమిత్తం తమిళనాడు వెళ్లే సామాన్య ప్రయాణికులకు కూడా ఎంతో వెసులుబాటు కలుగుతుంది. నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}