భార్యను చంపేసి డెడ్‌బాడీని బైక్‌ మీద పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన భర్త!

బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు బైక్ మీద తీసుకొచ్చాడు.

Published on: Dec 14, 2025 2:56 PM IST
By , Bapatla
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గృహ హింస కేసులో భాగంగా ఒక వ్యక్తి తనతో విడిపోయిన భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తన మోటార్‌సైకిల్‌పై ఉంచి పోలీస్ స్టేషన్‌ తీసుకొచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నిరంతరం గొడవల కారణంగా మహాలక్ష్మి వెంకటేశ్వర్లు నుంచి విడిపోయింది. వేరుగా ఉంటుంది. తన బతుకు తాను బతుకుతుంది.

ఆదివారం నాడు, వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. బంగారం ఇస్తానని చెప్పి గ్రామ శివార్లకు తనతో పాటు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తన మోటార్ సైకిల్ పై పెట్టుకుని సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు.

పోలీసులు వెంటనే ఆ మహిళను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఆమె మరణించి చాలాసేపు అయినట్టుగా వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

క్లాస్ వింటూ కుప్పకూలిన విద్యార్థి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. బెంచ్ మీద కూర్చుని పాఠాలు వింటున్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. రామచంద్రపురం నియోజకవర్గంలోని పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి అనే 14 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శనివారం రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లింది. క్లాస్ రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా.. బెంచ్‌పై కూర్చోని పాఠాలు విన్నది.

అయితే ఒక్కసారిగా సిరి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలియక టీచర్, తోటి విద్యార్థులు సిరిని పైకి లేపి చూశారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో బాలిక మరణించినట్టుగా వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్తెతో మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.