TTD BIRRD Trust Donation : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి చెంత మరో భారీ విరాళం నమోదైంది. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ…. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ (BIRRD) ట్రస్ట్కు రూ.4.41 కోట్ల విరాళాన్ని సోమవారం అందజేసింది.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, సంస్థ డైరెక్టర్లు ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందజేశారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ డీడీలను స్వీకరించారు. దాతల సేవా నిరతిని కొనియాడిన బోర్డు చైర్మన్, వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం కల్పించారు.
పేదలకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో టీటీడీ ఈ బర్డ్ ట్రస్టును నిర్వహిస్తోంది. ముఖ్యంగా వికలాంగులకు, ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఇక్కడ నిపుణులైన వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తారు. ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీతో పాటు పునరావాస సేవలను కూడా అందిస్తారు.
ఆర్ఎస్ బ్రదర్స్ అందించిన ఈ విరాళం బర్డ్ ఆసుపత్రిలోని వైద్య సదుపాయాల విస్తరణకు, పేద రోగుల చికిత్సకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తమ వంతు మద్దతును ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
టీటీడీ ఎస్వీ గోశాలకు గుర్రం విరాళం:
మరోవైపు మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం…. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.
{{/usCountry}}మరోవైపు మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం…. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.
{{/usCountry}}సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలియజేశారు.