ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై కొన్ని రోజుల కిందట ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు చేశారని ఆమె ఆరోపణలు చేశారు. కొన్ని రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టుగా రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

'శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.' అని చంద్రశేఖర్ అన్నారు.
వీడియోలు విడుదల చేస్తా : బాధితురాలు
ఆ మహిళ తన న్యాయవాదితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఒత్తిడితోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మేము న్యాయం కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 25 కోట్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేశాననే ఆరోపణలను మహిళ తీవ్రంగా ఖండించారు. 'ఇది నిరాధారమైన ఆరోపణ. నాకు న్యాయం మాత్రమే కావాలి, డబ్బు కాదు. ఎమ్మెల్యే నన్ను మాత్రమే కాకుండా, చాలా మంది మహిళలను వివాహేతర సంబంధంతో మోసం చేశాడు. త్వరలో ఎమ్మెల్యేకు సంబంధించిన మరిన్ని వీడియోలను విడుదల చేస్తాను.' అని ఆమె తెలిపింది.
అరవ శ్రీధర్ వివాహం చేసుకుంటానని చెప్పి ఒక సంవత్సరం పాటు తనను లైంగికంగా వేధించాడని మహిళ ఆరోపించింది. అబార్షన్లు చేయించుకోవాలని బలవంతం చేశాడని, బెదిరింపులు, వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ జనవరి 27న ఆ మహిళ వీడియో ప్రకటన విడుదల చేయడంతో వివాదం చెలరేగింది.
ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన పార్టీ
మరోవైపు జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎమ్మెల్యే శ్రీధర్ను ప్రశ్నించింది. సీనియర్ నాయకులు శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్లతో కూడిన కమిటీ శ్రీధర్ను రైల్వే కోడూరులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విచారించింది. ఆయన వాదనను నమోదు చేసింది.
{{/usCountry}}మరోవైపు జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎమ్మెల్యే శ్రీధర్ను ప్రశ్నించింది. సీనియర్ నాయకులు శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్లతో కూడిన కమిటీ శ్రీధర్ను రైల్వే కోడూరులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విచారించింది. ఆయన వాదనను నమోదు చేసింది.
{{/usCountry}}ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో పాటు నియోజకవర్గం నుండి దాదాపు 40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా కమిటీ పిలిపించింది. ఎమ్మెల్యే ప్రవర్తన, ఇటీవలి పరిణామాలు, కింది స్థాయిలో పార్టీ ఇమేజ్పై ఈ వివాదం ప్రభావం గురించి సభ్యులు అభిప్రాయాన్ని సేకరించారు.
విచారణ తర్వాత అరవ శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. పార్టీ కమిటీకి పూర్తి వివరణ ఇచ్చానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను వివరించానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నమోదైన కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానన్నారు.