జూన్ నెలలో తీవ్రమైన ఎండల తర్వాత, బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8.30 గంటల నుండి గురువారం (జూన్ 11, 2026) ఉదయం 8.30 గంటల మధ్య ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఉత్తర ప్రాంతంలో అత్యధికంగా 102 మి.మీ వర్షపాతం నమోదైంది, ఆ తర్వాతి స్థానంలో NTR జిల్లాలోని ఉటుకూరు (84 మి.మీ) నిలిచింది.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తెనాలిలో వరుసగా 82 మి.మీ, 66.75 మి.మీ వాన పడింది. శ్రీకాకుళం జిల్లాలోని గరికిపాడులో 72.5 మి.మీ, కృష్ణా జిల్లాలోని పెద అవుటపల్లి, మచిలీపట్నంలో వరుసగా 60.5 మి.మీ, 50.75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా అధికారుల సమాచారం ప్రకారం, ఈ సమయంలో తిరువూరులో 109.6 మి.మీ వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంబా అప్డేట్ చేయలేదు.
గురువారం ఉదయం విజయవాడలోని నీట మునిగిన రైల్వే అండర్పాస్ గుండా ట్రాఫిక్ నత్తనడకన సాగింది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిలో బస్సులు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.
గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లోని అనేక ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇందులో ఎక్కువ భాగం బుధవారం రాత్రే కురిసింది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం, పెందుర్తితో సహా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, గురువారం మార్కాపురం, రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు పోలవరంలో పగటిపూట తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, గురువారం మార్కాపురం, రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు పోలవరంలో పగటిపూట తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
{{/usCountry}}'మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంతో గురువారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పిడుగులతోకూడిన వానలు పడతాయి. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.'అని రాష్ట్ర విపత్త నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.