రోడ్డు భద్రతను పెంపొందించడానికి, మోటార్ సైకిల్ సంబంధిత ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి విశాఖపట్నం నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2026 నుండి నగరం అంతటా 'నో హెల్మెట్-నో పెట్రోల్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని పోలీసు అధికారులు సీరియస్గా చెప్పారు. బాధ్యతాయుతమైన రైడింగ్ను పెంపొందించడానికి, సిటీ రోడ్లపై మరణాలను తగ్గించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ ప్రచారం ప్రజలలో అవగాహన పెంచడం, ప్రాథమిక భద్రతా నిబంధనలను పాటించడాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ నొక్కి చెప్పారు. నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్ కేవలం ఒక నియంత్రణ కాదు, ఇది ప్రాణాలను రక్షించే చర్య అని పేర్కొన్నారు. ప్రతి రైడర్, వెనుక కూర్చున్నవారు(పిలియన్ రైడర్)ఇద్దరూ సేఫ్గా ఉంటారని తెలిపారు.
రైడర్లు ధరించే హెల్మెట్లు బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్ కలిగి ఉండాలని, జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఎస్ఐ మార్కును కలిగి ఉండాలని విశాఖ కమిషనర్ వెల్లడించారు. విశాఖపట్నం అంతటా అనేక పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించే, కొత్త నియమానికి మద్దతు ఇచ్చే సైన్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
'రైడర్లు మాత్రమే కాకుండా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని మేం కోరుతున్నాం. వారి భద్రత ముఖ్యం.' అని సీపీ బాగ్చి అన్నారు.
విశాఖ నగర పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం, విశాఖపట్నంలో 2025లో 1,086 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 2025 అంతటా ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి పలు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించారు. ఈ ప్రయత్నాలు ఉన్నప్పటికీ హెల్మెట్ ధరించకపోవడం నిరంతర సమస్యగా మిగిలిపోయింది. దీని వలన కఠినమైన చర్యల అవసరమవుతున్నాయి.
మేం అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ పోయకూడదన్నారు. పెట్రోల్ బంక్ ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారికి హెచ్చరికలు అందుతాయన్నారు. నిబంధనలను పాటించకపోతే పోలీసు శాఖ నుండి అధికారిక నోటీసులు వస్తాయని అన్నారు.
{{/usCountry}}మేం అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ పోయకూడదన్నారు. పెట్రోల్ బంక్ ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారికి హెచ్చరికలు అందుతాయన్నారు. నిబంధనలను పాటించకపోతే పోలీసు శాఖ నుండి అధికారిక నోటీసులు వస్తాయని అన్నారు.
{{/usCountry}}'క్రమం తప్పకుండా తనిఖీలు, జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్లు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. హెల్మెట్ నిబంధనపై పౌరులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలలో నగర పోలీసులు అవగాహన ప్రచారాలను ప్లాన్ చేస్తున్నారు.' అని ప్రవీణ్ కుమార్ చెప్పారు.