కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కోట్లాది మంది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయం చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి జలాశయానికి కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించారు.

హెలికాప్టర్లో కొప్పల్లోని ఐఆర్బీ హెలిప్యాడ్కు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్తోపాటుగా ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యామ్ వద్దకు ఒకే కారులో కలిసి వచ్చారు. తుంగభద్ర డ్యామ్ క్రెస్ట్ గేటు వద్దకు చేరుకున్న ప్రముఖులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అక్కడి నుండి గేట్ల ప్రారంభోత్సవ స్థలానికి వెళ్ళడానికి ఒక ప్రత్యేక బ్యాటరీతో నడిచే ఓపెన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఈ బ్యాటరీ వాహనంలో కూర్చుని సంయుక్తంగా గేట్ ప్రారంభోత్సవ స్థలానికి ప్రయాణించారు.
ఆటోమేటిక్ బటన్ను నొక్కడం ద్వారా జలాశయం 17, 18, 19, 20వ గేట్లను అధికారికంగా ప్రారంభించారు. నలుగురు ప్రముఖ నాయకులు ఒక్కో ద్వారాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమం ముగియగానే.. తుంగభద్ర డ్యామ్ గేటు ముందుకి విచ్చేసిన కర్ణాటక సీఎం డీ.కే.శివకుమార్, జలాశయంలో నీటికి చేతులు జోడించి ప్రార్థించారు.
ఈ సందర్భంగా సీఎం డీ.కే. శివకుమార్ శ్రీ గంగాధర స్వామి విగ్రహ చిత్రపటానికి నమస్కరించారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం డ్యామ్కు చెందిన ఉన్నతాధికారుల బృందం గేట్ల సాంకేతిక పనితీరు, నీటి సరఫరా నిర్వహణపై ప్రముఖులకు సమగ్రంగా వివరించింది.
అనంతరం మునీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపైకి ప్రముఖులు ప్రసంగించారు. మూడు రాష్ట్రాల మధ్య సరిహద్దు, జల వివాదాలు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం నాయకులందరూ ఒకే వేదికను పంచుకోవడం ఒక చారిత్రక ఘట్టం నిలిచింది.
{{/usCountry}}అనంతరం మునీరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపైకి ప్రముఖులు ప్రసంగించారు. మూడు రాష్ట్రాల మధ్య సరిహద్దు, జల వివాదాలు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం నాయకులందరూ ఒకే వేదికను పంచుకోవడం ఒక చారిత్రక ఘట్టం నిలిచింది.
{{/usCountry}}2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు.