సెప్టెంబరు మాసంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, ఇతర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం, తిరుచానూరు స్టేషన్ల మధ్య వారానికి రెండు రోజులు నడిచే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

మచిలీపట్నం – తిరుచానూరు స్పెషల్ (రైలు నంబర్: 07440) ప్రతి శుక్రవారం, శనివారం సెప్టెంబర్ 11, 12, 18 తేదీలలో నడుస్తుంది. మచిలీపట్నంలో సాయంత్రం 4:55 PM గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – మచిలీపట్నం స్పెషల్ (రైలు నంబర్: 07439) ప్రతి శనివారం, ఆదివారం సెప్టెంబర్ 12, 13, 19, 20 తేదీలలో ఉంటుంది. తిరుచానూరులో తెల్లవారుజామున 3:30కి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలులో అన్ని తరగతుల కోచ్లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్ 9 కోచ్లు ఉంటాయి. జనరల్ సెకండ్ క్లాస్ 4 కోచ్లతో ఉంటుంది.
తిరుపతిలో ప్రధాన స్టేషన్పై రద్దీ తగ్గించేందుకు తిరుచానూరు స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు వీకెండ్స్లో ప్రయాణించడానికి ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు.
సుబేదార్గంజ్ – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్
{{/usCountry}}సుబేదార్గంజ్ – యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్
{{/usCountry}}ఉత్తరప్రదేశ్లోని సుబేదార్గంజ్, బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సమయంలో రద్దీని తగ్గించడానికి నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ స్టాప్లు ఉన్నాయి.
04135 సుబేదార్గంజ్ – యశ్వంతపూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది. 11.09.2026 నుండి 04.12.2026 మధ్య 13 సర్వీసులు ఉంటాయి.
04136 యశ్వంతపూర్ – సుబేదార్గంజ్ నడుమ ప్రతి సోమవారం ఉంటుంది. 14.09.2026 నుండి 07.12.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, కృష్ణ, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ యాద్గిర్, రాయచూర్, యలహంక, శంకర్గఢ్, దభౌరా, మాణిక్పూర్, సత్నా, కాట్ని, జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బలార్షాలో ఆగుతుంది.