దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులు, స్టేషన్ల విషయంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ లో పలు స్టేషన్లు కలపడం, విడదీయడం వంటి నిర్ణయాలతో ఆదాయంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. సుమారు 50 కిలోమీటర్ల పొడవైన పలాస-ఇచ్చాపురం సెక్షన్ లో ఏడు స్టేషన్లు(పలాస, సుమ్మదేవి, మందాస రోడ్, బరువా, సోంపేట, ఝాడుపూడి,ఇచ్చాపురం.) ఉన్నాయని పేర్కొంది. ఇవన్నీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపింది.ఈ స్టేషన్లలో ఏదీ కూడా ఒడిశా పరిధిలో లేదని పేర్కొంది.
"ఈ స్టేషన్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీని నిర్వహించే చిన్న నుంచి మధ్య తరహా స్టేషన్లు. వీటిలో ఏదీ ప్రధాన సరుకు రవాణా స్థానం కాదు. అందువల్ల ఈసీఓఆర్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడదు' అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఏ జోన్ కు అధికార పరిధి ఉందనే దానితో సంబంధం లేకుండా సరుకు రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని రైల్వేశాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలు జోనల్ సరిహద్దుల వెంబడి నిరంతరాయంగా ఉండేలా చూస్తాయని వివరించింది.
'రైళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. పలాసా-భువనేశ్వర్, పలాసా-కటక్, ఇచ్చాపురం-కటక్ మెమూ / ప్యాసింజర్ సర్వీసులతో సహా ప్రస్తుతం ఉన్న అన్ని రైళ్లు షెడ్యూల్, మార్గం లేదా ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా నడుస్తాయి" అని రైల్వేశాఖ తెలిపింది.
సిబ్బంది నియామకంతో సహా బదిలీకి సంబంధించిన విధివిధానాలను తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల మధ్య ఖరారు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. నిబంధనల ప్రకారం రైల్వే ఉద్యోగులందరి ప్రయోజనాలు, సేవా నిబంధనలు పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది.
{{/usCountry}}సిబ్బంది నియామకంతో సహా బదిలీకి సంబంధించిన విధివిధానాలను తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల మధ్య ఖరారు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. నిబంధనల ప్రకారం రైల్వే ఉద్యోగులందరి ప్రయోజనాలు, సేవా నిబంధనలు పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది.
{{/usCountry}}ఒడిశా పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధత అచంచలమైనదని రైల్వేశాఖ తెలిపింది. ఒడిశాలో రైల్వే నెట్వర్క్ విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ సేవలు, తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్పై రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేయడం ఈ నిబద్ధతకు నిదర్శనమని గుర్తు చేసింది.