సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ చైర్ కార్ సేవల విజయవంతం తర్వాత.. సుదీర్ఘ ప్రయాణాలను మరింత హాయిగా మార్చేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్కు దసరా పండుగ నాటికి తొలి వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే రాత్రివేళల్లో, సుదూర ప్రయాణాలు చేసేవారికి సౌకర్యవంతంగా ఉండేలా స్లీపర్ వెర్షన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ రైళ్లు విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి వసతులను ప్రయాణికులకు అందించనున్నాయి.
ప్రతి వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. వీటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కేటగిరీలు అందుబాటులో ఉంటాయి. కోచ్ లోపల ఆహ్లాదకరమైన ఇంటీరియర్ డిజైన్తో పాటు ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో బయటి శబ్దాలు లోపలికి రాకుండా ప్రయాణికులు హాయిగా నిద్రపోయేందుకు సౌండ్ప్రూఫ్ సాంకేతికతను ఉపయోగించారు.
వేగవంతమైన వైఫై, ప్రతి సీటు వద్ద పవర్ ఛార్జింగ్ పాయింట్లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే బోర్డులు ఉంటాయి. రైలు కదిలే ముందు, స్టేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకునే తలుపులు ఉన్నాయి.
ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రత్యేకంగా రూపొందించారు. వేగంతో పాటు ప్రయాణికుల భద్రతకు రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కవచ్ సెన్సార్లు, సెన్సార్ల ఆధారిత ఆధునిక రక్షణ వ్యవస్థలను ఇందులో అమర్చారు.
రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రైలును విజయవాడ పరిధిలో ప్రారంభించేందుకు అవసరమైన ట్రాక్ అప్గ్రేడేషన్, సిగ్నలింగ్ పనుల ప్రిపరేషన్ను అధికారులు వేగవంతం చేస్తున్నారు. దసరా సమయానికి ఈ సేవలు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సమయం బాగా ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం మరింత హాయిగా ఉంటుంది.
{{/usCountry}}రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రైలును విజయవాడ పరిధిలో ప్రారంభించేందుకు అవసరమైన ట్రాక్ అప్గ్రేడేషన్, సిగ్నలింగ్ పనుల ప్రిపరేషన్ను అధికారులు వేగవంతం చేస్తున్నారు. దసరా సమయానికి ఈ సేవలు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సమయం బాగా ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం మరింత హాయిగా ఉంటుంది.
{{/usCountry}}