...
...
Next Story

Banana Farmers : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. రాయలసీమ అరటి రైతులపై ఎఫెక్ట్

Banana Farmers : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాయలసీమ అరటి రైతులపై పడుతున్నాయి. ధరలు దారుణంగా పడిపోతున్నాయి. అంతేకాదు ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది.

Published on: Mar 14, 2026, 10:58:21 IST
Advertisement

పశ్చిమాసియాలో యుద్ధం రాయలసీమ ప్రాంతంలోని అరటి రైతులపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ఫలితంగా అరటి ఎగుమతులు ఆగిపోయాయి. అంతేకాదు మార్కెట్లలో ధరలు పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.20,000 నుండి రూ.25,000 వరకు పలికింది. ఇప్పుడు అది టన్నుకు రూ.8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర దొరుకుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అరటిపండ్లు తోటల్లోనే ఉన్నాయి.

అరటి ఎగుమతులపై ప్రభావం
అరటి ఎగుమతులపై ప్రభావం

కడప, అనంతపురం ప్రాంతాలలో ప్రధానంగా పండించే అరటికి దక్షిణ, ఉత్తర రాష్ట్రాలలోనే కాకుండా గల్ఫ్ దేశాలలో కూడా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార సంస్థలు సాధారణంగా తోటలను సందర్శించి గ్రామంలోని రైతుల నుండి నేరుగా అరటిపండ్లను కొనుగోలు చేస్తాయి. వాటిని ప్యాకేజీ చేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. టర్కీలో అరటిపండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి పండ్లు వారం పాటు నిలవవని వ్యాపారులు చెబుతున్నారు. రాయలసీమ అరటిపండ్లు దాదాపు 12 రోజులు ఉంటాయి. ఎగుమతుల్లో అందుకే అగ్రస్థానం.

అరటి ధరలు అకస్మాత్తుగా పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది. తోటలోనే అరటిపండ్లు ఉన్నాయి. ఇంకా తెంపలేదు. ప్రస్తుత ధరతో ఎరువులు, పురుగుమందులపైనా పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి పొందలేకపోతున్నారు అన్నదాతలు. అరటి రైతులను కాపాడటానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అనంతపురంలో 16000 హెక్టార్లలో కడపలో 26,000 హెక్టార్లలో, కర్నూలు జిల్లాలో 5,000 హెక్టార్లలో అరటి తోటలు విస్తరించి ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో అనంతపురంలో 13 లక్షల టన్నులు, కడప జిల్లాల్లో 11 లక్షల టన్నులు సహా 40 లక్షల టన్నులకు పైగా మంచి దిగుబడి వచ్చింది. రైతులు నెల రోజుల క్రితమే తమ పంటలో సగం అమ్మేసినప్పటికీ, మిగిలిన ఉత్పత్తి అమ్మకాల్లో ఇబ్బందులు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe