పశ్చిమాసియాలో యుద్ధం రాయలసీమ ప్రాంతంలోని అరటి రైతులపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ఫలితంగా అరటి ఎగుమతులు ఆగిపోయాయి. అంతేకాదు మార్కెట్లలో ధరలు పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.20,000 నుండి రూ.25,000 వరకు పలికింది. ఇప్పుడు అది టన్నుకు రూ.8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర దొరుకుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అరటిపండ్లు తోటల్లోనే ఉన్నాయి.

కడప, అనంతపురం ప్రాంతాలలో ప్రధానంగా పండించే అరటికి దక్షిణ, ఉత్తర రాష్ట్రాలలోనే కాకుండా గల్ఫ్ దేశాలలో కూడా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార సంస్థలు సాధారణంగా తోటలను సందర్శించి గ్రామంలోని రైతుల నుండి నేరుగా అరటిపండ్లను కొనుగోలు చేస్తాయి. వాటిని ప్యాకేజీ చేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. టర్కీలో అరటిపండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి పండ్లు వారం పాటు నిలవవని వ్యాపారులు చెబుతున్నారు. రాయలసీమ అరటిపండ్లు దాదాపు 12 రోజులు ఉంటాయి. ఎగుమతుల్లో అందుకే అగ్రస్థానం.
అరటి ధరలు అకస్మాత్తుగా పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది. తోటలోనే అరటిపండ్లు ఉన్నాయి. ఇంకా తెంపలేదు. ప్రస్తుత ధరతో ఎరువులు, పురుగుమందులపైనా పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి పొందలేకపోతున్నారు అన్నదాతలు. అరటి రైతులను కాపాడటానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనంతపురంలో 16000 హెక్టార్లలో కడపలో 26,000 హెక్టార్లలో, కర్నూలు జిల్లాలో 5,000 హెక్టార్లలో అరటి తోటలు విస్తరించి ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో అనంతపురంలో 13 లక్షల టన్నులు, కడప జిల్లాల్లో 11 లక్షల టన్నులు సహా 40 లక్షల టన్నులకు పైగా మంచి దిగుబడి వచ్చింది. రైతులు నెల రోజుల క్రితమే తమ పంటలో సగం అమ్మేసినప్పటికీ, మిగిలిన ఉత్పత్తి అమ్మకాల్లో ఇబ్బందులు ఉన్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ, కలకత్తాతో సహా స్థానిక మార్కెట్లకు మాత్రమే అరటిపండ్లను రవాణా అవుతున్నాయి. యుద్ధానికి ముందు ప్రతిరోజూ 7-10 ట్రక్కులను రవాణా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మూడు ట్రక్కుల వరకు మాత్రమే ఆర్డర్లు వస్తున్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం ఢిల్లీ, కలకత్తాతో సహా స్థానిక మార్కెట్లకు మాత్రమే అరటిపండ్లను రవాణా అవుతున్నాయి. యుద్ధానికి ముందు ప్రతిరోజూ 7-10 ట్రక్కులను రవాణా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మూడు ట్రక్కుల వరకు మాత్రమే ఆర్డర్లు వస్తున్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారు.
{{/usCountry}}