ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్-చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న శీల మణి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 'ఆల్-ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్' (AISHE) రిజిస్ట్రేషన్ పొందని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర విద్యాసంస్థలు తక్షణమే AISHE పోర్టల్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే AISHE కోడ్లను కలిగి ఉన్న విద్యాసంస్థలు మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తాజాగా ఒక ప్రకటనలో ఉన్నత విద్యామండలి వైస్-చైర్పర్సన్ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా కొత్త విద్యాసంస్థలు, ఇంతవరకు రిజిస్టర్ చేసుకోని సంస్థల కోసం 2025-26, 2026-27 విద్యా సంవత్సరాలకు గాను AISHE పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
AISHE అనేది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఒక సమగ్ర వెబ్ ఆధారిత సర్వే. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో నాణ్యతను, పారదర్శకతను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సర్వే ద్వారా కింది కీలక సమాచారాన్ని సేకరిస్తారు:
- విద్యార్థుల నమోదు సంఖ్య
- అధ్యాపకుల సంఖ్య మరియు వారి వివరాలు
- విద్యా కార్యక్రమాలు/కోర్సులు
- మౌలిక సదుపాయాలు
- విద్యాసంస్థల ఆర్థిక వనరుల వివరాలు
ఈ విధంగా సేకరించిన డేటా దేశంలో విద్యా ప్రణాళికల రూపకల్పన, కొత్త విధానాల అమలు, ఉన్నత విద్యా రంగ వృద్ధికి అత్యంత కీలకమైన వనరుగా మారుతుంది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రధాన AISHE సర్వే ఇంకా ప్రారంభం కాలేదని వైస్-చైర్పర్సన్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కేవలం కొత్త సంస్థల నమోదుకు మాత్రమే విండో ఓపెన్ అయిందని తెలిపారు. న్యూఢిల్లీలోని AISHE ప్రధాన కార్యాలయం నుండి ఆదేశాలు అందిన వెంటనే, డేటా సమర్పణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, గడువు వివరాలను రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అన్ని విద్యాసంస్థలు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి డేటాబేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత విద్యా డేటా కచ్చితంగా, సమగ్రంగా నమోదు కావాలంటే అన్ని కళాశాలల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
{{/usCountry}}అర్హత కలిగిన అన్ని విద్యాసంస్థలు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి డేటాబేస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత విద్యా డేటా కచ్చితంగా, సమగ్రంగా నమోదు కావాలంటే అన్ని కళాశాలల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
{{/usCountry}}