ఏపీతో నార్త్ ఇండియాకు కనెక్టివిటీ పెంచేలా సరికొత్తగా నాలుగు వరుసల హైస్పీడ్ రోడ్ నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పుర్ నుండి ప్రారంభమై మన రాష్ట్రంలోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల హైస్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ (AAC) ఆమోదముద్ర వేసింది. ఏపీ పరిధిలోని ఎలైన్మెంట్కు ఆమోదం లభించినట్టుగా పేర్కొంది.

నాలుగు రాష్ట్రాల గుండా సాగే ఈ మెగా ప్రాజెక్టు మొత్తం పొడవు 1,107 కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే అత్యధికంగా 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రూట్ను కేంద్రం యధాతథంగా ఆమోదించింది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ ఈ రోడ్డు ఉంటుంది.
ఏపీలో కనెక్టివిటీ పొందే కీలక ప్రాంతాలు
కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ
అరకు, పాడేరు, చింతపల్లి
గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం
లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు
ఈ రహదారి ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ORRలో అనుసంధానమవుతుంది.
ఈ గ్రీన్ఫీల్డ్ కారిడార్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల గుండా వెళ్లనుంది. దీనికోసం ప్రత్యేకంగా భూసేకరణ అధికారుల నియామకం వేగవంతమైంది. ఇప్పటికే మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారుల జాబితాను గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపగా, మిగిలిన జిల్లాల వివరాలను త్వరలోనే సమర్పించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 1,107 కి.మీ.(ఏపీలో 457 కి.మీ.)గా ఉంది. గంటకు 100 - 120 కి.మీ వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. భూసేకరణ వెడల్పు 90 మీటర్లుగా తీసుకుంటున్నారు. 10,630 హెక్టార్ల భూకి అవసరం అవుతుంది. భూసేకరణ, పునరావాస వ్యయం రూ.8,982 కోట్లుగా ఉంది. సివిల్ పనుల అంచనా రూ.55,772 కోట్లు కాగా.. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.75,629 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పరిదిలో ప్రాజెక్టు వ్యయం రూ.32,000 కోట్లు అవుతుందని అంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రహదారికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎలైన్మెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఖరారు కానుంది. వచ్చే మార్చి నాటికి ఈ ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ రహదారికి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎలైన్మెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఖరారు కానుంది. వచ్చే మార్చి నాటికి ఈ ప్రాజెక్టుకు తుది అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}