చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచేలా కుప్పం ఎయిర్ పోర్ట్ ఉంటుందని చెప్పారు. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో రైతులతో గ్రామసభలో ఆయన మాట్లాడారు.

కుప్పం నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయానికి భూమిని అందించడానికి శాంతిపురం, రామకుప్పం మండలాల చాలా మంది రైతులు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చారని కలెక్టర్ సుమిత్ పేర్కొన్నారు. వారికి న్యాయమైన పరిహారం, ఇళ్ళు, భూములు, పశువుల రక్షణతో సహా పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. భూమిని కోల్పోయే రైతులకు అర్హత ఉన్న అన్ని ప్రయోజనాలు అందేలా చూడటానికి ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనున్నారు.
పలమనేరు, వి.కోట, మదనపల్లె ప్రాంతాల రైతులు చెన్నై, కోల్కతా, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ విమానాశ్రయం సహాయపడుతుందని, దీని వలన మంచి ధరలు, మెరుగైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ సుమిత్ అన్నారు. ప్రాంతీయ వాణిజ్యం పెరుగుతుందని చెప్పారు. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ జరుగుతుందని, ఈ ప్రాజెక్ట్ దాదాపు 500 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు.
2027 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కలెక్టర్ సుమిత్ అన్నారు. బెంగళూరుకు సమీపంలో ఉండటం వల్ల ఈ విమానాశ్రయం కుప్పం, సమీప ప్రాంతాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెస్తుందని నమ్ముతున్నారు.
విమానాశ్రయానికి భూమి ఇవ్వడానికి ముందుకు రావాలని, నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. ఈ మేరకు శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని రైతులను కోరారు. ఈ ప్రాజెక్ట్ కుప్పం, పరిసర ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.
అందుబాటులోకి భోగాపురం ఎయిర్పోర్ట్
{{/usCountry}}విమానాశ్రయానికి భూమి ఇవ్వడానికి ముందుకు రావాలని, నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. ఈ మేరకు శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని రైతులను కోరారు. ఈ ప్రాజెక్ట్ కుప్పం, పరిసర ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.
అందుబాటులోకి భోగాపురం ఎయిర్పోర్ట్
{{/usCountry}}విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఏపీలో మరో ఎయిర్ పోర్టు నుంచి ప్రజలు రాకపోకలు సాగించవచ్చు. ఎయిర్ పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. 95 శాతం పనులు పూర్తవ్వగా.. 5 శాతం పనులు కావాల్సి ఉంది. మిగిలిన 5 శాతం పనులను జూన్ వరకు పూర్తి చేసి.. ఆగస్టు నుంచి ఎయిర్పోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జనవరి 4వ తేదీన టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలుసాగించడానికి అనుకూలంగా అన్ని విమానయాన సంస్థలతో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరపనున్నారు.