పూర్ణియా నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభం
బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా నగరం నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభమైంది. అంతేకాదు పూర్ణియా నుంచి దిల్లీకికి కూడా సర్వీసు ముదలైంది.
బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా విమానాశ్రయం తన సేవలను కొత్త విమానాశ్రయాలకు విస్తరించింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలతో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరానికి పూర్ణియా నుంచి నేరుగా కొత్త సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని, ఐటీ నగరానికి నేరుగా ప్రయాణించే అవకాశాలు పెరిగాయని ప్రయాణికులు సంతోషంగా ఉన్నారు. ప్రత్యక్ష కనెక్టివిటీ ప్రయాణ ఖర్చులను తగ్గించదు.. కానీ సమయాన్ని ఆదా చేస్తుంది.
పూర్ణియా విమానాశ్రయ డైరెక్టర్ డీపీ గుప్తా మాట్లాడుతూ.. ఆదివారం నాడు విమానం తొలిసారిగా పూర్ణియా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దిల్లీ నుండి బయలుదేరిన విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి, హైదరాబాద్ వెళ్లే విమానంలో కూడా 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంది. గత రెండు రోజులుగా టిక్కెట్లకు మంచి డిమాండ్ ఉందని, ప్రజలలో ఉత్సాహం ఉందని ఆయన వివరించారు.
పూర్ణియా నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న బిట్స్ పిలాని విద్యార్థి అర్ష్ మాట్లాడుతూ.. గతంలో దిల్లీ లేదా పాట్నా నుండి పూర్ణియా చేరుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు విమాన సేవలు ప్రారంభించడంతో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సమయం ఆదా అవుతుందన్నారు.
ముదటి రోజున ఇండిగో విమానం ఉదయం 10:45 గంటలకు దిల్లీ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు పూర్ణియా విమానాశ్రయానికి చేరుకుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. దిల్లీకి వెళ్లే విమానం మధ్యాహ్నం 1:50 గంటలకు పూర్ణియా విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం 3:55 గంటలకు ఢిల్లీకి చేరుకుంది.
హైదరాబాద్ నుండి పూర్ణియాకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి పూర్ణియాకు ఇండిగో విమానం.. పూర్ణియా చేరుకునే సమయం మధ్యాహ్నం 2:25 గంటలకు, పూర్ణియా నుండి బయలుదేరే సమయం మధ్యాహ్నం 3:25 గంటలకు షెడ్యూల్ చేశారు.

E-Paper












