టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా హాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను నిర్వహించనున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో ఈ కార్యక్రమం ఉండనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
నిర్విరామంగా కార్యక్రమాలు…

మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుంచి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా నిర్వహిస్తారు. ఇందులో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పంథాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.
- తిరుపతి మహతి క్షేత్రంలో ఎం. సరళ బృందంతో శివస్తోత్ర పారాయణం, జి. ప్రభాకర్ శర్మతో పురాణ ప్రవచనం ఉంటుంది. సి. హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు.
- కపిలతీర్థంలో వి. ప్రసన్న లక్ష్మీ బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం, ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, సి. హెచ్. జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం ఉంటుంది. వై. వేంకటేశ్వర్లు నేతృత్వంలో సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
- అన్నమాచార్య కళామందిరంలో జి. ఇందిరారాణి బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం, వి. నిర్మలా బాయ్ తో పురాణ ప్రవచనం ఉంటుంది. సి.హెచ్. అజయ్ కుమార్ బృందంతో పార్వతి పరిణయం నృత్య రూపకం, జె. కృష్ణ కుమారి ఆధ్వర్యంలో పార్వతి పరిణయం హరికథ నిర్వహిస్తారు. సంప్రదాయ పాఠశాల విద్యార్థినులతో శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు.