mana isuka vahanam : మన ఇసుక వాహనం.. ఆన్‌లైన్‌లోనే నేరుగా మీరే బుకింగ్ చేసుకోవచ్చు!

mana isuka vahanam : తెలంగాణ ప్రభుత్వం ఇసుక విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు మన ఇసుక వాహనం పథకాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా ఆన్‌లైన్‌లోనే నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు.

Updated on: Apr 6, 2026, 18:01:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పారదర్శకతను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లాలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశపెట్టింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా పౌరులు నేరుగా అధికారిక పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, తమ అభ్యర్థనను సమర్పించి, నిర్దేశించిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తును ఆమోదించే ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ దానిని పరిశీలిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే ఇసుక సరఫరా అవుతుంది. బ్రోకర్లను ఆశ్రయించకుండా అధికారిక వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

ఈ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే ఇసుక సరఫరా అవుతుంది. బ్రోకర్లను ఆశ్రయించకుండా అధికారిక వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వ ఇసుక విక్రయాల్లో పారదర్శకతను పెంచడానికి, అక్రమ రవాణాను అరికట్టడానికి మన ఇసుక వాహనం తీసుకొచ్చింది. ఈ విధానంతో జనాలే నేరుగా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 'మధ్యవర్తులు లేదా బ్రోకర్ల ప్రమేయం లేకుండా పౌరులు అధికారిక పోర్టల్ ద్వారా నేరుగా ఇసుకను బుక్ చేయవచ్చు. దీనికోసం దరఖాస్తుదారులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించి, నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు తహసీల్దార్ ఆ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఆమోదం చెబుతారు. ప్రజలు అస్సలు దళారులను ఆశ్రయించవద్దు.' అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు.

ఈ స్కీమ్ మెుదటగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో దశలవారీగా అమలుచేస్తున్నారు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లేనివారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శనిని సంప్రదించి.. కూడా ఇసుకను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకుంటే.. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం కారణంగా వినియోగదారుల మీద అదనపు ఆర్థిక భారం పడదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More