నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదంలో ఇటీవల 14 మంది ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. ఘోర ప్రమాదానికి సంబంధించి మార్కాపురం జిల్లా పోలీసులు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్, యజమానిని అరెస్టు చేశారు. ప్రయాణ సమయంలో బస్సు పలుమార్లు ఆగిపోయినప్పటికీ, ప్రయాణాన్ని కొనసాగించారు.

మార్చి 26వ తేదీన ఉదయం సుమారు 5.40 గంటలకు ఎన్హెచ్-565పై రాయవరం గ్రామం సమీపంలో ఘటన జరిగింది. హరి కృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న సమయంలో ప్రమాదం అయింది.
21 ఏళ్ల పాండెం యువరాజు అనే డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అతను గతంలో క్లీనర్గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అధిక జీతాలు ఇవ్వడం ఎందుకనే ఉద్దేశంతో బస్సు యజమానికి హరికృష్ణ.. యువరాజను డ్రైవర్గా పెట్టుకున్నాడు.
ప్రయాణ సమయంలో సెన్సార్, ఇంజన్ సమస్యల కారణంగా బస్సు కనీసం మూడుసార్లు ఆగిపోయింది. ప్రతిసారీ, డ్రైవర్ యజమానికి తెలియజేయగా.. రాత్రిపూట మెకానిక్లు లేదా ప్రత్యామ్నాయ బస్సులు లేవని పేర్కొంటూ, తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రయాణం కొనసాగించమని యజమాని యువరాజుకు సూచించాడు. యజమాని సలహా మేరకు యువరాజు బస్సు నడుపుతూ వచ్చాడు.
ఎర్రగొండపాలెం టోల్ ప్లాజా వద్ద బస్సు మరోసారి పాడైపోవడంతో దాన్ని తిరిగి మరమ్మత్తు చేశారు. ప్రయాణికులు డ్రైవర్ను ప్రశ్నించగా.. యజమాని వస్తున్నారని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ ప్రయాణం కొనసాగించారు.
మరోసారి బస్సు పాడవక ముందే కలిగిరి చేరుకోవాలనే ప్రయత్నంలో డ్రైవర్ అతివేగంగా వాహనం నడిపాడని పోలీసులు తెలిపారు. రాయవరం సమీపంలోని ఒక మలుపు వద్దకు బస్సు రాగానే, అది కుడివైపునకు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది.
{{/usCountry}}మరోసారి బస్సు పాడవక ముందే కలిగిరి చేరుకోవాలనే ప్రయత్నంలో డ్రైవర్ అతివేగంగా వాహనం నడిపాడని పోలీసులు తెలిపారు. రాయవరం సమీపంలోని ఒక మలుపు వద్దకు బస్సు రాగానే, అది కుడివైపునకు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది.
{{/usCountry}}క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. కొంతమంది ప్రయాణికులు కిటికీలు పగలగొట్టి బయటకు దూకి తప్పించుకోగా, 14 మంది బస్సులోనే సజీవ దహనం అయ్యారు. బస్సు పరిస్థితి అధ్వాన్నంగా ఉందని డ్రైవర్, యజమాని ఇద్దరికీ పూర్తిగా తెలుసని, అయినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారని విచారణలో తేలింది. రాయవరం రైల్వే వంతెన సమీపంలో పోలీసులు ఇద్దరు నిందితులను బీఎన్ఎస్ సెక్షన్ 105, 125(ఎ), 125(బి) కింద అరెస్టు చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైవే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పలువురు ప్రయాణికులను రక్షించారు. సహాయక బృందాల వేగవంతమైన స్పందనను జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రశంసించారు.