1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల ద్వారా 45,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఈహెచ్ఎస్ కింద వైద్య సదుపాయాలను పొందుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 45,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద వైద్య సదుపాయాలను పొందుతున్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. శాసనసభకు తెలియజేశారు.

ఆర్టీసీ డిస్పెన్సరీలు లేకపోవడం, ఈహెచ్ఎస్ కింద చికిత్స పొందడంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వి.పార్థసారథి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈహెచ్ఎస్ కింద సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అవసరమైన చోట అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేసినట్టుగా మంత్రి అన్నారు.
ఆర్థిక సహాయం వివరాలను అందిస్తూ.. 2025లోనే 734 మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ.4.85 కోట్లు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కింద తిరిగి చెల్లించినట్లు రాంప్రసాద్ తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల పెన్షన్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యం, భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అంకితభావంతో చేసిన కృషిని అభినందించారు. విజయవాడలోని కేంద్ర ఆసుపత్రితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిస్పెన్సరీల ద్వారా ప్రస్తుతం ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన సభకు తెలియజేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


