అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ) ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ఆదివారం నాడు గ్రామంలో పురుషులు ప్రత్యేకంగా మగవారి పొంగళ్లు పండుగను జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ రోజున ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి తిరిగి వచ్చిన పురుషులు తమ ఇళ్ల నుండి వంట సామాగ్రిని తెచ్చి, ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు తయారు చేసి, సంజీవరాయలకు నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామస్తులు ఈ ప్రాంతంలో ఈ ఆచారాన్ని సంక్రాంతి కంటే చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి లేదా దేవతకు సమర్పించిన పొంగళ్లను తినడానికి అనుమతి లేదు, ప్రాంగణం వెలుపల నుండి మహిళలు దర్శనం చేసుకోవచ్చు. తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో ఈ ఒక్కరోజు మాత్రం మహిళలకు ఎంట్రీ ఉండదు. పురుషులే పొంగళ్లు వండి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఆలయం బయట నుంచి దర్శించుకుని మెుక్కులు తీర్చుకున్నారు.
స్థానిక నమ్మకం ప్రకారం, అనేక శతాబ్దాల క్రితం ఒక సాధువు తిప్పాయపల్లె గ్రామాన్ని సందర్శించాడు. పురుషుల నుండి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాడు. మహిళల నుండి నైవేద్యాలను తిరస్కరించాడు. వెళ్ళే ముందు ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి... సంజీవరాయగా నామకరణం చేశాడు. గ్రామస్తులను నిర్దిష్ట ఆచారాలను పాటించమని ఆదేశించాడు. ఆలయ గోపురం లేదా గర్భగుడి నిర్మించవద్దని కూడా ఆదేశించాడు. నేటికీ ఆలయానికి సరిహద్దు గోడలు మాత్రమే ఉన్నాయి.
మరొక నమ్మకం ప్రకారం, పంట దిగుబడి తక్కువగా ఉండి, వర్షాలు లేక, తిప్పాయపల్లె గ్రామస్థులు కష్టాలు పడుతుండేవారు. ఇదే సమయంలో ఒక బ్రాహ్మణుడు గ్రామంలోకి వచ్చాడు. సంజీవరాయని పూజించమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత గ్రామంలో కరువు పోయింది, ప్రజల కష్టాలు పోయాయి. ఆ తర్వాత మగవారు పొంగళ్లు సమర్పించాలని చెప్పారు. ఈ సంప్రదాయం గ్రామాన్ని దుష్ట శక్తులు, ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ పండుగ తిప్పాయపల్లె, పొరుగు గ్రామాల నుండి భక్తులను ఆకర్షిస్తూనే ఉంది.
{{/usCountry}}మరొక నమ్మకం ప్రకారం, పంట దిగుబడి తక్కువగా ఉండి, వర్షాలు లేక, తిప్పాయపల్లె గ్రామస్థులు కష్టాలు పడుతుండేవారు. ఇదే సమయంలో ఒక బ్రాహ్మణుడు గ్రామంలోకి వచ్చాడు. సంజీవరాయని పూజించమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత గ్రామంలో కరువు పోయింది, ప్రజల కష్టాలు పోయాయి. ఆ తర్వాత మగవారు పొంగళ్లు సమర్పించాలని చెప్పారు. ఈ సంప్రదాయం గ్రామాన్ని దుష్ట శక్తులు, ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ పండుగ తిప్పాయపల్లె, పొరుగు గ్రామాల నుండి భక్తులను ఆకర్షిస్తూనే ఉంది.
{{/usCountry}}