మొంథా తీవ్ర తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతోంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా తీరంలో అలలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా… విద్యా సంస్థలు కూడా మూసివేశారు. మంగళవారం రాత్రి మొంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకగా… క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్…. తుపానుగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది.

రానున్న 6 గంటల్లో తుఫాన్…. తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తుండగా… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం… ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉంది.
ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడొచ్చు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు సూచనలున్నాయి. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు పడొచ్చు.
సెలవులు పొడిగింపు…!
ఏపీలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడగించారు. మొంథా తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలతో సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఈనెల 30 వరకు మాత్రమే మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది.
మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సాయం చేయనుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.
{{/usCountry}}మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సాయం చేయనుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.
{{/usCountry}}తుఫాను ప్రభావం ఉన్న గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం కనిపిస్తోందన్నారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి... వాటిని ఎప్పటికప్పుడు తొలిగిస్తున్నామని చెప్పారు. బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట, వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.