తిరుపతి (ఆంధ్రప్రదేశ్), తిరువణ్ణామలై (తమిళనాడు) నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ ముగ్గురు పార్లమెంట్ సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి విజ్ఞప్తి చేసింది.

ఎంపీలు ఎం. గురుమూర్తి (తిరుపతి), వై.ఎస్. అవినాష్ రెడ్డి (కడప), సి.ఎన్. అన్నాదురై (తిరువణ్ణామలై) సంయుక్తంగా ఈ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు. తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానించే ఈ రహదారిని అభివృద్ధి చేయడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం గణనీయంగా పుంజుకుంటుందని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, ఈ పర్యాటక ప్రాంతాల పరిసరాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని ఎంపీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కోరారు.
జాతీయ రహదారులపై ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. తమ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను తక్షణమే పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి విలేకరులకు తెలిపారు.
పెరుగుతున్న వాహనాల రాకపోకల అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాలని ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రహదారి విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్నారు. వాహనదారులకు మెరుగైన భద్రత కల్పించాలన్నారు.
ఈ రూట్ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుమధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని గడ్కరీకి ఎంపీలు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే భక్తులు, వ్యాపార వర్గాలకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.
{{/usCountry}}ఈ రూట్ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుమధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని గడ్కరీకి ఎంపీలు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. నిత్యం రాకపోకలు సాగించే భక్తులు, వ్యాపార వర్గాలకు అధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.
{{/usCountry}}