రూ.679.71 కోట్లతో నాలుగు వరుసలుగా ముదిగుబ్బ-కదిరి జాతీయ రహదారి!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ముదిగుబ్బ-కదిరి మధ్యలో ఎన్‌హెచ్‌-42 రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనుంది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Jul 24, 2026, 05:32:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ముదిగుబ్బ - కదిరి గ్రామాల మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్‌-42 రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించేందుకు రూ.679.71 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా కేవలం రహదారిని వెడల్పు చేయడమే కాకుండా, ప్రయాణికుల భద్రత, సులువుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక నిర్మాణాలను చేపడుతున్నారు: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే 4 వరుసల రహదారిలో ప్రధాన కారేజ్‌వే, స్థానిక గ్రామాల ప్రజలకు, నెమ్మదిగా వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సర్వీస్ రహదారులు వస్తాయి.

ట్రాఫిక్ నిర్వహణ కోసం ఒక నూతన ఫ్లైఓవర్, వాహనాల రాకపోకల కోసం ఒక వెహికిల్ అండర్‌పాస్ కం రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఇందులో భాగంగా రానుంది. మార్గ మధ్యలో రవాణాకు అడ్డంకిగా ఉన్న నీటి ప్రవాహాల వద్ద ఒక ప్రధాన భారీ బ్రిడ్జి నిర్మాణం చేపడతారు.

ఈ రహదారి వల్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో నేరుగా వేగవంతమైన అనుసంధానం లభిస్తుంది. ప్రతిష్టాత్మక బెంగళూరు - విజయవాడ - కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌వేకు ఇది అనుసంధాన మార్గంగా మారి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.

తిరుపతి పుణ్యక్షేత్రానికి, చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది.

ఈ ప్రాంతంలో విస్తారంగా పండే వేరుశనగ, టమోటా, ఇతర పండ్ల తోటల ఉత్పత్తులను సరిహద్దు రాష్ట్రాలకు, ప్రధాన నగరాల మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఈ 4 వరుసల రహదారి ఎంతో కీలకమవుతుంది. సరకు రవాణా వ్యయం తగ్గి, స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఊపందుకుంటాయని, తద్వారా ప్రాంతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More