కాపు సామాజికవర్గ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నివాసం వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ గందరగోళం వాతావరణం ఏర్పడింది.

ముద్రగడ పద్మనాభంతో ఆయన కుమార్తె క్రాంతికి కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన కుమార్తె క్రాంతి మాత్రం ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు.
తన తండ్రి, సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని క్రాంతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గతేడాది ముద్రగడ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయనకు క్యాన్సర్ ఉందని, కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దాస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనపై కుమార్తె చేసిన ఆరోపణల పట్ల తీవ్ర వేదనకు గురైన ముద్రగడ పద్మనాభం.. తన రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కుమార్తె పావుగా మారిందని ఆవేదన చెందారు. ఈ మేరకు 'నేను చనిపోయాక నా కుమార్తె క్రాంతి నా ముఖం చూడటానికి వీల్లేదు, చివరి చూపునకు కూడా రావద్దు.' అని కామెంట్స్ చేశారు.
తండ్రి మరణవార్త విన్న క్రాంతి.. కడసారి చూపు కోసం పోలీసుల భద్రత నడుమ కిర్లంపూడిలోని ఇంటికి వచ్చారు. కానీ ఆమెను చూడగానే ముద్రగడ భార్య(క్రాంతి తల్లి), ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను లోపలికి రానిచ్చేది లేదని చెప్పారు. అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను కోరారు.
పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కుటుంబ సభ్యులు వినలేదు. కనీసం తండ్రి పార్థివదేహాన్ని ఉంచిన బాక్స్ను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదు. దీంతో దూరంగా నిలబడి తండ్రిని చూస్తూ క్రాంతి బిగ్గరగా రోదిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముద్రగడ అనుచరులు కూడా క్రాంతి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.
{{/usCountry}}పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కుటుంబ సభ్యులు వినలేదు. కనీసం తండ్రి పార్థివదేహాన్ని ఉంచిన బాక్స్ను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదు. దీంతో దూరంగా నిలబడి తండ్రిని చూస్తూ క్రాంతి బిగ్గరగా రోదిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముద్రగడ అనుచరులు కూడా క్రాంతి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.
{{/usCountry}}