టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిగులు జలాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం 2,000 నుండి 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, మిగులు జలాల వినియోగంపై వివాదాలు అనవసరమని అన్నారు. అవి ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర జలాల పంపిణీపై బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోదరుల్లాగా కలిసి ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ నీటిని దొంగిలిస్తోంది అని ఆరోపిస్తూ సెంటిమెంట్ సృష్టించడానికి పదే పదే చేసిన ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను ప్రశ్నించారు. ఇంత పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతున్నప్పుడు అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తారని సోమిరెడ్డి అడిగారు.
ఆంధ్రప్రదేశ్ ఒక్క చుక్క నీటిని కూడా వాడుకోవడానికి అనుమతించబోమని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటనను వ్యతిరేకించారు సోమిరెడ్డి. నీటిని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చడానికి తాను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి మిగులు జలాలను వినియోగించుకుంటామని కేసీఆర్ ఒకసారి చెప్పారని సోమిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు వారి గత వైఖరిని గుర్తు చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలను ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించే ప్రకటనలను నివారించాలని సోమిరెడ్డి కోరారు. తెలంగాణలోని అనేక నీటిపారుదల ప్రాజెక్టులను అనుమతులు లేకుండానే చేపట్టారని ఆరోపించారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు ఢిల్లీ, హైదరాబాద్ లేదా అమరావతిలో సమావేశం కావాలని సోమిరెడ్డి కోరారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచాలనే కర్ణాటక ప్రతిపాదన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రమాదాలను కలిగిస్తుందని హెచ్చరించారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.
{{/usCountry}}మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు ఢిల్లీ, హైదరాబాద్ లేదా అమరావతిలో సమావేశం కావాలని సోమిరెడ్డి కోరారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచాలనే కర్ణాటక ప్రతిపాదన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రమాదాలను కలిగిస్తుందని హెచ్చరించారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.
{{/usCountry}}